తరుచు రెడ్ మీ నోట్ 4 మొబైల్స్ పేలుతున్నాయని తరుచు వార్తలు వస్తున్నాయి. ఛార్జింగ్ పెట్టిన ఫోన్లు, జేబులో ఫోన్లు వరసగా పేలిపోతున్నాయి. అలా పేలడం వల్ల కష్టమర్లు ఆస్పత్రిపాలవ్వడం, మరికొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. అయితే వీటిని నివారించేందుకు నిపుణులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు.
1. ఛార్జింగ్ 96శాతంకంటే తక్కువ 20కంటే తక్కువ ఉండే విధంగా చూసుకోవాలి
2.ఛార్జింగ్ పెట్టే సమయంలో పాటలు వినడం, నెట్ బ్రౌజ్ చేయడం లాంటివి చేయకూడదు.
3.ఛార్జింగ్ పెట్టే సమయంలో మీఫోన్ కు ఉన్న పౌచ్ తీసివేయాలి.
4.మీ ఫోన్ వేడిగా ఉందనిపిస్తే ఫోన్ వినియోగించుకోవద్దు. తప్పనిసరి అనిపిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి మాట్లాడుకోవాలి. అదీ ఎక్కవ సమయం మాట్లాడకూడదు.
5.చౌక దరకే ఛార్జర్లు వస్తున్నాయని వినియోగించుకోవద్దు. వీలైనంత వరకు కంపెనీ బ్రాండెండ్ ఛార్జర్లు మాత్రమే వినియోగించుకోవాలి.
6.అనవసరమైన యాప్ లను వినియోగించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా మొబైల్ పేలుడునుంచి మిమ్మిల్ని మీరు కాపాడుకోవచ్చు.