పెళ్లి చేయడం లేదని కన్నవాళ్లనే చంపేశాడు.. తమిళనాడులో దారుణం

తనకు పెళ్లి చేయడం లేదన్న కోపంతో ఓ కొడుకు కిరాతకుడిగా మారాడు. కనిపెంచిన తల్లిదండ్రులనే అతి కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులోని వేలూరులో జరిగింది. తిరువణ్ణామలై తండ్రాంపట్టు సమీపంలోని కుప్పంతాంగల్‌ గ్రామానికి చెందిన గోవిందస్వామి(60), మాంగణి(55) దంపతులకు కొడుకు రామ్‌కుమార్, ముగ్గురు కుమార్తెలున్నారు. కూలి పనులు చేసే గోవిందస్వామి ముగ్గురు కుమార్తెలకు వివాహం చేశాడు. ప్రస్తుతం కొడుకు రామ్‌కుమార్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

Also Read:

అయితే రామ్‌కుమార్‌‌కు ఏం సంబంధం కుదరకపోవడంతో తల్లిదండ్రులు మదనపడేవారు. ఈ క్రమంలోనే తనకు వెంటనే పెళ్లి చేయాలని అతడు రోజూ తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. దీంతో బుధవారం తెల్లవారుజామున రామ్‌కుమార్‌ ఇంట్లో ఉన్న రుబ్బు రాయితో గోవిందస్వామి, మాంగణి తలపై కొట్టి చంపేశాడు. ఈ తర్వాత ఇంటికి తాళం వేసి తిరువణ్ణామలైకి సైకిల్‌పై వెళ్లాడు.

Also Read:

గురువారం ఉదయం గోవిందస్వామి కుమార్తె తల్లిదండ్రులను చూసేందుకు రాగా ఇంటికి తాళం వేసి ఉంది. కిటికీలో నుంచి చూడగా తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో ఆమె కేకలు వేయగా స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. దీనిపై సమాచారం అందుకున్న సాతనూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రామ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here