విజయవాడ అంటే చదువులు , చదువుల తండ్రులు , సరస్వతులు అంటూ చెబుతూ ఉంటారు. ఇంటర్ చదువుల కోసం విజయవాడ నే కేరాఫ్ గా చెప్పేస్తారు. ఇక ఎంసెట్ సంగతి తీసుకుంటే టాప్ ర్యాంక్ లు అన్నీ వారికే వచ్చి తీరతాయి. అలాంటి విద్యానిలయం ఐన విజయవాడ కి ఈ సంవత్సరం ఎంసెట్ గాలి తీసేసింది అనే చెప్పాలి.
నిన్న తాజాగా విడుదల అయిన ఎంసెట్ ఫలితాలు బెజవాడ కి తీవ్ర నిరాశ మిగిల్చాయి. టాప్ టెన్ ర్యాంకుల్లో ఈ సారి విజయవాడ కి ఒక్క స్థానం కూడా రాకపోవడం షాకింగ్ గా ఉంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లా మాత్రం మెడిసిన్ లో ఫస్ట్ ర్యాంక్, ఇంజినీరింగ్ విభాగంలో నాలుగో ర్యాంకు దక్కించుకుంది. ఇంజినీరింగ్ టాప్ టెన్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐదుగురు విద్యార్థులు నిలిచారు. తమ పిల్లలకి ఫుల్లు ఫీజులు కట్టి చదివిస్తున్న లక్షల మంది లో ఒక్కరికి కూడా ర్యాంక్ రాకపోవడం తో పేరెంట్స్ ఆందోళనగా ఉన్నారు.