పట్టిసీమ పంపింగ్‌లో ‘మేఘా’మరో రికార్డు..

పట్టిసీమ మరో రికార్డును అధిగమించింది. నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో
చోటుచేసుకున్న మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) తాజాగా ప్రాజెక్ట్‌ నిర్వాహణలోనూ మైల్‌స్టోన్‌ను
అధిగమించింది. ఈ సీజన్‌లో బుధవారం (నవంబర్‌ 15) నాటికి నిరంతరాయంగా 148 రోజులు నీటిని పంపింగ్‌ చేసి
అనతికాలంలోనే 100 టిఎంసీల నీటిని గోదావరి నుంచి కృష్ణాకు ఎత్తిపోతల ద్వారా మళ్లించి నదుల అనుసంధానంలో మరో
రికార్డును సాధించింది. మొత్తం మీద మూడు సీజన్‌లలోనూ 159 టిఎంసీల నీటిని అందించగా గత ఏడాది (2016లో) 55.6
టిఎంసీలు, అంతకుముందు ఏడాది అంటే పట్టిసీమను ప్రారంభించిన సంవత్సరం 2015లో 4 టిఎంసీల నీటిని ఈ పథకం
పంపింగ్‌ చేసింది. ఎత్తిపోతల పథకాలు సంక్లిష్టమైనవి అయినందున సాంకేతిక సమస్యలతో తరచూ మరమ్మత్తులకు
గురవుతాయనే అభిప్రాయం బలంగా ఉన్న పరిస్థితుల్లో ఈ పథకం ఎటువంటి అంతరాయం లేకుండా ఇప్పటికీ ఒక లక్షా
20వేల గంటలు పనిచేసింది.
ఈ పథకంలోని 24 మోటార్లు నిరంతరాయంగా 148 రోజుల్లో 25,36,06,000 కిలోవాట్ల విద్యుత్‌ వినియోగం ద్వారా
నిరంతరాయంగా 72వేల గంటల పాటు పనిచేసి ఎలెక్ట్రోమేకానికల్ రంగంలో ఈ సంస్థ తనకున్న నైపుణ్యాన్ని
నిరూపించుకుంది. కృష్ణా నదికి పై నుంచి నీటి లభ్యత ప్రతి ఏడాది క్రమంగా తగ్గిపోతుండడంతో కృష్ణా డెల్టాను
ఆదుకునేందుకు గోదావరి నీటి మళ్లింపే లక్ష్యంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్ల క్రితం పూర్తి చేయగా ఈ ఏడాది
కృష్ణా డెల్టాకు అవసరమైన నీటిని మొత్తం గోదావరి నుంచే మళ్లించేందుకు ఈ పథకం ఎంతోగానో ఉపయోగపడింది.
డెల్టాలోని మొత్తం ఆయకట్టుకు 13 లక్షల ఎకరాలకు నీరందించింది.
దేశం మొత్తంమీదనే నిర్దేశించిన గడువులోగా బడ్జెట్‌ అంచనాల పెంపుదల లేకుండా పూర్తిచేసిన తొలి ప్రాజెక్ట్‌ ఇదే. ఎన్ని
అవాంతరాలు ఎదురైనా మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ దీనిని ఒక సవాలుగా తీసుకొని 2000 వేల మంది సిబ్బందితో
రాత్రింబవళ్లు పనిచేసి, నిర్దేశించిన గడువుకంటే ముందుగానే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసింది. ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని చేపట్టిన 173
రోజులలో (సెప్టెంబర్‌ 18, 2015న) తొలి పంప్‌నుంచి నీటిని విడుదల చేసింది. పట్టిసీమ ప్రాజెక్ట్‌ను 30 మార్చి 2015న
నిర్మాణం చేపట్టిన ఎంఈఐఎల్‌ ఏడాదికంటే ముందుగానే అంటే 2016 మార్చి 20 న పూర్తి చేసింది. తద్వారా ఎంఈఐఎల్‌
లిమ్కా బుక్‌లో రికార్డుగా నమోదు సాధించుకుంది. సముద్ర మట్టం కంటే దిగువన డయాఫ్రం వాల్‌ వంటి అత్యంత క్లిష్టమైన
కాంక్రీట్‌ నిర్మాణాలను పూర్తి స్థాయి దేశీయ పరిజ్ఞానంతో నిర్మించింది.
7476 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న 24 పంప్‌లతో కూడిన పట్టిసీమ ప్రాజెక్ట్‌ ఏసియాలోనే అతిపెద్దది. ఇరిగేషన్‌ రంగానికి
సంబంధించి మనదేశంలోనే తొలి ప్రాజెక్ట్‌గా రికార్డులకెక్కిన పట్టిసీమను పూర్తిచేసిన ఘనత ఎంఈఐఎల్‌దే. పట్టిసీమ ప్రాజెక్ట్‌

24 పంపుల ద్వారా సెకనుకు 240 క్యూమిక్కుల నీటిని విడుదలు చేస్తుంది. ప్రాజెక్ట్‌ను ప్రారంభించినప్పటినుంచి
ఇప్పటివరకు 1.20 లక్షల గంటలు మోటార్లు పనిచేశాయి. అంటే సగటున ఒక్కొక్క మోటర్‌ 5 వేల గంటలకు పైగా ఎలాంటి
అవాంతరాలు లేకుండా పనిచేశాయి. తొలి ఏడాది అంటే 2015లో 93 రోజులు మోటార్లు 4 టీఎంసీల నీటిని, 2016లో 137
రోజులు పనిచేసిన మోటార్లు 55.6 టీఎంసీలు, 2017లో ఇప్పటి వరకు (148) పనిచేసిన మోటార్లు 100 టీఎంసీల నీటిని
పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణాడెల్టాకు నీటిని అందించాయి.
దేశ వ్యాప్తంగా ఎత్తిపోతల పథకాల నిర్మాణం, నిర్వాహణ వ్యయంతో కూడుకున్నదని ఆచరణలో సాధ్యం కాదని రకారకాల
వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రోత్సహంతో ఎంఈఐఎల్‌ తన సాంకేతిక సమర్థతను నిరూపించుకొని
అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ మూడు సంవత్సరాల్లో వ్యవసాయరంగ నిపుణుల అంచనాల ప్రకారం 24 వేల కోట్ల
విలువైన పంటలను కృష్ణాడేల్టా రైతులు పండించారు.
ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనివిధంగా పట్టిసీమ వల్లే కృష్ణాడేల్టా రైతులు జూన్‌ నెల ఆరంభంలో తమ పంటలకు నీటిని
పొందగలిగారు. నీటి లభ్యత లేకపోవటం వల్ల అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో వరినాట్లు వేసే కృష్ణాడేల్టా రైతులు ఆ తర్వాత
వచ్చే ప్రకృతి వైపరీత్యాల వల్ల వేలకోట్ల పంటలను నష్టపోయేవారు. అయితే ఈ ఏడాది ముందస్తుగా పట్టిసీమ నుంచి నీటిని
పొందుతున్న రైతులు వరినాట్ల నుంచి పంటచేతికి వచ్చేవరకు ఎలాంటి విపత్తుల బారిన పడకుండా ఆనందంతో ఉన్నారు.
గోదావరి నీటి వల్ల గతంలో కంటే తాము అధిక దిగుబడిని సాధిస్తున్నామని స్థానిక రైతులు చెబుతున్న నేపథ్యంలో
అందుకుగల కారణాలను వ్యవసాయ, జలవనరు శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
దేశంలో రెండు ప్రధానమైన నదులను అనుసంధానం చేసింది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే. ఆ రెండు నదులు గోదావరి-కృష్ణా.
నదుల అనుసంధానానికి మూలాధారం పట్టిసీమ ప్రాజెక్ట్‌. ఈ ప్రాజెక్ట్‌ను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసిన ఘనత మేఘా
ఇంజనీరింగ్‌దే.
ప్రతి ఏడాది 110 రోజులలో 80 టిఎంసీల నీటిని గోదావరి నుంచి కృష్ణాడెల్టాకు తరలించాలనేది పట్టిసీమ ప్రాజెక్ట్‌ ముఖ్య
ఉద్దేశం.
ఈ ఏడాది ఇప్పటివరకు (148) రోజులలో 100 టిఎంసీల నీటిని తరలించారు. అంటే 20శాతం అధికంగా నీటిని తరలించారు.
ఒక సీజన్‌లో ఒక ఎత్తిపోతల పథకం ద్వారా 100 టిఎంసీల నీటిని తరలించడం కూడా రికార్డ్‌.
ఈ ఏడాది కృష్ణాడెల్టాలో 98శాతం ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడూ ఇది జరగలేదు.

సాధారణంగా ఎత్తిపోతల పథకాలలో మోటార్లు ఒక సీజన్‌లో మూడు నెలలు లేదా అంతకంటే తక్కువ పనిచేస్తాయి. ఉన్న
మోటార్లలో కూడా కొన్నింటినే వినియోగిస్తారు. అయితే పట్టిసీమలో 24 మోటార్లను ఈ ఏడాది గత నాలుగు నెలలుగా
పనిచేస్తూనే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here