” పిల్లలని చంపేస్తున్న నారాయాణ కాలేజీ “

నారాయణ కాలేజీలో చదువుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారని, వెంటనే కాలేజీలను మూసివేయాలని కోరుతూ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న సాయి ప్రజ్వల అనే అమ్మాయి ఇల్లొదిలి పారిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ శివార్లలోని మేడిపల్లిలో కలకలం సృష్టించింది. 11వ తేదీ బుధవారం ఈ ఘటన జరుగగా, బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికిన తల్లిదండ్రులు, తాజాగా పోలీసులను అశ్రయించారు. కాలేజీలో వేధింపుల వల్ల తాను తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని, వాటిని తట్టుకోలేకపోతున్నానని కూడా ప్రజ్వల తన లేఖలో ప్రస్తావించింది.
 “సారీ డాడీ, సారీ మమ్మీ, ఐ మిస్ యూ సో మచ్. బై అక్క. వేస్ట్ నారాయణ కాలేజ్. దే ఆర్ కిల్లింగ్ ది స్టూడెంట్స్ టూ రీడ్. సో ప్లీజ్ హెల్ప్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ నారాయణ” అంటూ లేఖ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఇంటి నుంచి బయలు దేరిన తరువాత సాయి ప్రజ్వల ఎటు వెళ్లిందన్న విషయాన్ని సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here