Hyderabad: ప్రియురాలితో వైస్‌ చైర్మన్ రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించిన భార్య

శివారులోని ఓ మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌‌ ప్రియురాలితో లాడ్జిలో అడ్డంగా దొరికిపోయాడు. అతని భార్యే దగ్గరుండి మరీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించడం తీవ్ర కలకలం రేపింది. లాక్‌డౌన్ వేళ లాడ్జిలు, హోటళ్లకు అనుమతులు లేకపోయినా ఓయో లాడ్జిలో వైస్ చైర్మన్ రాసలీలల బండారం బయటపడడం నగరంలో చర్చనీయాంశమైంది. నిబంధనలు ఉల్లంఘించి ఏకంగా లాడ్జిలో ప్రియురాలితో రాసలీలలు సాగిస్తున్న వైస్ చైర్మన్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నగర శివారులోని మున్సిపాల్టీ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఓ రాజకీయ నేతకు అదే ప్రాంతానికి చెందిన మహిళతో పెట్టుకున్నాడు. ఆమెతో రాసలీలలు సాగించేవాడు. ఆ విషయం భార్యకు తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరించేది. కొద్దిరోజులుగా భర్త ఇంటికి సరిగ్గా రాకుండా బయటే తిరుగుతున్నాడు. దాదాపుగా ఇంటికి రావడం మానేయడంతో అనుమానం వచ్చి భర్త కదలికలపై నిఘా పెట్టింది.

Also Read:

భర్తికి తెలియకుండా స్పై ఆపరేషన్ నిర్వహించి అతని స్నేహితుడికి వనస్థలిపురంలో లాడ్జి ఉన్నట్లు తెలుసుకుంది. అందులోనే తన ప్రియురాలితో భర్త ఎంజాయ్ చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాడ్జిలో ప్రియురాలితో రాసలీలలు సాగిస్తున్న భర్తని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఓయో లాడ్జిపై దాడులు చేసిన పోలీసులు ముగ్గురు మహిళలు, వైస్ చైర్మన్ సహా లాడ్జి యజమానిని అదుపులోకి తీసుకున్నారు.

వైస్ చైర్మన్ తన ప్రియరాలితో ఎంజాయ్ చేస్తుండగా.. లాడ్జి యాజమాని కూడా మరో అమ్మాయితో ఉన్నట్లు తెలిసింది. మరో అమ్మాయి కూడా లాడ్జిలో ఉండడంతో ముగ్గురు యువతులతో సహా ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కి తరలించారు. అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తని భార్య స్వయంగా పట్టించడం.. అందులోనూ ఆయన వైస్ చైర్మన్ కావడంతో సంచలనంగా మారింది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here