కూతురు ముందే ఆమె భర్తని చంపిన తండ్రి .. వామ్మో

తక్కువ కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న కక్షతో తన కుమార్తె స్వాతి కళ్ల ముందే, ఆమె భర్త అంబోజి నరేష్ ను శ్రీనివాసరెడ్డి హత్య చేశాడని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. అల్లుడిని హత్య చేసే సమయంలో స్వాతి కూడా ఘటనా స్థలిలోనే ఉందని తెలిపారు. తన సోదరుడు, మరో వ్యక్తి సాయంతో హత్య చేశారని తెలిపారు. భర్త మరణాన్ని కళ్లారా చూసిన తరువాతనే ఆమె తొలుత ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలతో బయటపడిందని, ఆపై ఆత్మహత్య చేసుకుందని చెప్పిన పోలీసులు, స్వాతి మరణంపైనా అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

కాగా, ప్రేమించి ముంబై వెళ్లిపోయి వివాహం చేసుకున్న స్వాతి, నరేష్ లను శ్రీనివాసరెడ్డి భువనగిరికి రావాలని చెప్పగా, మే 2న వారు రాగా, అప్పటి నుంచి నరేష్ కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. భువనగిరికి 40 కిలోమీటర్ల దూరంలోనే బస్సును ఆపి వారిద్దరినీ దించిన శ్రీనివాసరెడ్డి, నరేష్ ను హత్య చేసి స్వాతిని ఇంటికి తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here