AK Tripathi: కరోనా వైరస్‌ సోకి లోక్‌పాల్ సభ్యుడి మృతి

కరోనా వైరస్ బారిన పడిన సభ్యుడు అజయ్ కుమార్ త్రిపాఠి కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు వదిలారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆయన చనిపోయారు. ఏప్రిల్ తొలి వారంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్పించారు. అనంతరం ఐసీయూలోకి మార్చి చికిత్స అందించారు. త్రిపాఠిని ట్రామా కేర్ సెంటర్‌కు తరలించారు. ఇక్కడ ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి చికిత్స అందిస్తారు. కానీ ఎయిమ్స్ ట్రామా సెంటర్‌ను ఇటీవలే కోవిడ్-19 హాస్పిటల్‌గా మార్చారు. ఇందులోకి మార్చిన తొలి పేషెంట్ త్రిపాఠినే కావడం గమనార్హం.

త్రిపాఠి ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించారు. తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగవడంతో వెంటిలేటర్ తొలగించారు. కానీ మళ్లీ అనారోగ్యం తీవ్రం కావడంతో వెంటిలేటర్ అమర్చారు.

త్రిపాఠి చాలా బలహీనంగా ఉన్నారని, గత మూడు రోజులుగా ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నారని సమాచారం. ఛత్తీస్‌గఢ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా పని చేసిన త్రిపాఠి.. అవినీతి వ్యతిరేక స్వతంత్ర సంస్థ అయిన ‘లోక్‌పాల్’లోని నలుగురు జ్యుడీషియల్ సభ్యుల్లో ఒకరు. 2019 మార్చి 23న ఆయన లోక్‌పాల్ సభ్యుడిగా నియమితులయ్యారు. బిహార్ అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గానూ పని చేసిన .. పాట్నా హైకోర్ట్ అడిషనల్ జడ్జిగానూ సేవలు అందించారు.

మన దేశంలో గత 24 గంటల్లోనే 2411 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 37,776కు చేరింది. వీరిలో 1223 మంది చనిపోగా 10,017 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here