సీఎం ఇంట్లో డ్రైవర్‌కు కరోనా.. కలిసి జీవించాలేమో!

క ట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. కరోనా వైరస్ దోబుచులాడుతోంది. కరోనాతో కలిసి జీవించాలనే ముఖ్యమంత్రుల మాటలను నిజం చేస్తూ.. ఏకంగా ముఖ్యమంత్రి వద్ద పనిచేసే డ్రైవర్‌కే కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సీఎం ఇంట్లో కలకలం రేగింది. రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వద్ద కారు డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్న 59 ఏళ్ల వ్యక్తికి క‌రోనా సోకినట్లు మంగ‌ళ‌వారం (మే 5) నిర్ధార‌ణ అయింది. వెంటనే అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

బాధితుడు నివాసం ఉంటున్న జైపూర్‌లోని బ‌జాజ్ న‌గర్ ప్రాంతంలో క‌ర్ఫ్యూ విధించి చర్యలు చేపట్టారు. అత‌డు ఎవ‌రెవ‌రిని క‌లిశాడు? ఎక్కడికి వెళ్లాడు? తదితర వివరాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే.. సీఎం అశోక్ గెహ్లాట్ కుటుంబానికి మాత్రం ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. డ్రైవర్‌లో కరోనా లక్షణాలు కనిపించడంతో అంతకుముందే అతడికి సెలవుపై ఇంటికి పంపించినట్లు అధికారులు తెలిపారు.

దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. రాజస్థాన్‌లో బుధవారం నాటికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3200కు చేరుకుంది. జైపూర్‌లో కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా కారణంగా ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 77 మంది మరణించారు. ఇదే సమయంలో 1400 మందికి పైగా వైర‌స్ నుంచి కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here