షాకింగ్: క‌్వారంటైన్ కేంద్రాన్ని త‌ర‌లించాలంటూ ఎమ్మెల్యే ఆందోళ‌న‌

క‌రోనా వైర‌స్ పాజిటివ్ రోగుల‌తోపాటు, క‌రోనా అనుమానిత వ్య‌క్తుల‌ను క్వారంటైన్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తారు. అయితే త‌మ ప్రాంతంలోని క్వారంటైన్ కేంద్రాన్ని త‌ర‌లించాలంటూ మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్ ప్రాంత బీజేపీ ఎమ్మెల్యే ఒక‌రు ఆందోళ‌న చేస్తున్నారు. తాజాగా న‌గ‌రంలోని క‌లెక్ట‌రేట్ ఆవ‌ర‌ణ‌లో క్వారంటైన్ కేంద్రాన్ని ఎత్తివేయాలంటూ దర్నా చేప‌ట్టారు. త‌మ‌ప్రాంతంలో జ‌న సాంద్ర‌త అధికంగా ఉంద‌ని, ఇప్పటికే క‌రోనా కార‌ణంగా అంద‌రూ ఆందోళ‌న చెందుతున్నార‌ని, ఈక్ర‌మంలో క్వారంటైన్ కేంద్రాన్ని తరలించాలంటూ స‌ద‌రు ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

Must Read:

నాగ్‌పూర్ హిగ్నాకు చెందిన ఎమ్మెల్యే స‌మీర్ మెఘే.. త‌మ ప్రాంతంలోని క్వారంటైన్ కేంద్రాన్ని ఎత్తివేయాల‌ని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టికే త‌మ ప్రాంతంలోని బాబాసాహెబ్ బాలుర హాస్ట‌ల్‌లో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డం ఏమాత్రం సమంజ‌సం కాద‌ని, దీన్ని వెంట‌నే ఎత్తివేయాల‌ని ఆందోళ‌న చేశారు.

Must Read:

ఇక మ‌హ‌రాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త చాలా అధికంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 6800కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే 300 మందికిపైగా ఈ మ‌హ‌మ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని ముంబై, పుణే ప్రాంతాల‌ను హాట్‌స్పాట్ కేంద్రాలుగా ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here