రేపు సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్… లాక్ డౌన్ పొడిగింపుపై చర్చ

మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సోమవారం అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ కానున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సీఎంలతో మోదీ సమావేశం కానుండడం ఇది నాలుగోసారి. కరోనా వ్యాప్తి కట్టడి, లాక్ డౌన్ అమలు జరుగుతున్న తీరు, ఆంక్షల కొనసాగింపు, సడలింపు తదితర అంశాలపై ప్రధాని చర్చించనున్నారు.

సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో లాక్‌డౌన్ పొడిగింపుపై సమీక్షించే అవకాశం ఉంది. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసే విషయంపై సీఎంలతో మాట్లాడే అవకాశం ఉంది. లాక్‌డౌన్ నిష్క్రమణ ప్రణాళిక, దానిని దశలవారీగా ఎలా అమలు చేయాలనే దానిపైనా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రాలు ఆర్థిక ప్యాకేజీని అడిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ చట్టం (ఎఫ్ఆర్‌బీఎం)కు సవరణలు కూడా అడిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ప్రధానితో రేపటి (సోమవారం) సమావేశంలో బీహార్, ఒడిశా, గుజారత్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి, ఈశాన్య రాష్ట్రాల నుంచి మేఘాలయ, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్రమోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న తీరుతో ఆందోళన చెందుతున్న అనేక రాష్ట్రాలు మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలని కోరుకుంటున్నాయి. దీనిపైనా మోదీ ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here