రిటైర్డ్ మహిళా ఎస్సైపై గ్యాంగ్ రేప్.. షెల్టర్ హోంలో దారుణం

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీస్ ఆఫీసర్ చేయి నరికేసిన ఘటన మరువక ముందే పంజాబ్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ రిటైర్ట్ మహిళా ఎస్సైని చేసిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. లాక్‌డౌన్ కారణంగా షెల్టర్ హోంలో చిక్కుకుపోయిన రిటైర్డ్ ఎస్సైపై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో జరిగింది.

జీఆర్పీ(రైల్వే పోలీస్) ఎస్సైగా పనిచేసి రిటైరైన మహిళా అధికారి(50) జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సడెన్‌గా లాక్‌డౌన్ విధించడంతో ఆమె పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో చిక్కుకుపోయారు. స్థానిక జీఆర్పీ పోలీసుల సాయంతో షెల్టర్ హోంలో ఆశ్రయం పొందుతున్న రిటైర్డ్ మహిళా ఎస్సైని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు.

Also Read:

ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల ఒకటో తేదీన ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై బాధితురాలు ఫిరోజ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే ఉద్యోగి అయిన భర్త మరణించడంతో ఆమెకు జీఆర్పీలో ఉద్యోగం వచ్చినట్లు తెలుస్తోంది. సబ్ ఇన్‌స్పెక్టర్‌ హోదాలో ఆమె సర్వీస్ నుంచి రిటైర్ అయినట్లు సమాచారం.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here