యువకుడితో ఆంటీ అఫైర్.. అడ్డుగా ఉన్నాడని భర్తకు విషమిచ్చి

అక్రమ సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తనే చంపాలని ప్లాన్ వేసిందో మహిళ. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారని, ఇలాంటి పనులు మానుకోవాలని చెప్పడమే ఆ భర్త చేసిన పాపమైంది. తన సుఖానికి అడ్డు వస్తున్నాడని ఆమె ఈ దురాగతానికి పాల్పడింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగింది. జంషెడ్‌పూర్‌లోకి ఓ ప్రాంతానికి చెందిన గోపాల్‌కు భార్య రాణి, ఇద్దరు పిల్లలున్నారు. గోపాల్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

Also Read:

అయితే భర్త పడుతున్న కష్టాన్ని పట్టించుకోని రాణి అదే ప్రాంతానికి ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త పనికి వెళ్లగానే ప్రియుడిని ఇంటికి రప్పించుకుని రాసలీలలు కొనసాగించేది. ఈ విషయం తెలుసుకున్న గోపాల్ పద్ధతి మార్చుకోవాలని భార్యను ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె పట్టించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. భర్త తన సుఖానికి అడ్డొస్తున్నాడని భావించిన రాణి అతడిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది.

Also Read:

గురువారం రాత్రి భర్త తినే ఆహారంలో విషం కలిపింది. అది తిన్న గోపాల్ వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. సరైన సమయంలో చికిత్స అందించడంతో గోపాల్ కోలుకున్నాడు. అతడు తిన్న ఆహారంలో విషం కలవడంతోనే ఇలా జరిగినట్లు డాక్టర్లు తేల్చారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని విచారించి వాంగ్మూలం తీసుకున్నారు. రాణిని అదుపులోకి తీసుకుని విచారించగా అడ్డు తొలగించుకునేందుకే భర్తను చంపాలని ప్లాన్ వేసినట్లు అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి.. ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here