మృత్యు శకటం.. పట్టాలపై నిద్రిస్తోన్న 15 మంది వలస కూలీలను చిదిమేసిన రైలు బండి

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. పట్టాలపై నిద్రిస్తోన్న 14 మంది వలస కూలీల ప్రాణాలను వేగంగా దూసుకొచ్చిన రైలు బండి బలి తీసుకుంది. శుక్రవావారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలు సొంతూరుకు వెళ్లే క్రమంలో.. రాత్రి సమయంలో పట్టాలపై నిద్రించారని తెలుస్తోంది. కానీ గూడ్స్ రైలు రూపంలో మృత్యువు వారిని కబళించింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం బాధిస్తోంది. కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔరంగాబాద్-జల్నా రైల్వే లైన్‌లో ఈ ప్రమాదం జరిగింది.

రైలు వేగంగా దూసుకొని వచ్చి ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కాగా ఉదయం 6 గంటలకు సమాచారం అందడంతో పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి బయల్దేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here