మాంసం అమ్మకాలను నిషేధించండి: సుప్రీంలో పిల్

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా మాంసం అమ్మ‌కాల‌ను నిషేధించాలంటూ సుప్రీంకోర్టును ఓ సంస్థ ఆశ్ర‌యించింది. క‌రోనా పుట్టినిల్ల‌యిన చైనాలో మాంసం అమ్మ‌కాల‌పై నిషేధం విధించార‌ని, అందుకు విరుద్ధంగా భార‌త్‌లో మాంసం అమ్మ‌కాల‌ను బాగా ప్రొమోట్ చేస్తున్నార‌ని విశ్వ జైన్ సంఘ‌ట‌న్ అనే సంస్థ ప్ర‌జా ప్ర‌యోజ‌న ‌వ్యాజ్యాన్ని దాఖ‌లు చేసింది. తాజాగా క‌రోనా వైర‌స్‌ను ల్యాబుల్లో రూపొందించ‌లేద‌ని, జంతువుల నుంచే సంక్ర‌మించింద‌ని వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ (డ‌బ్ల్యూహెచ్ఓ) స్ప‌ష్ట‌త‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే.

Must Read:

ఈ నేప‌థ్యంలో కేంద్ర ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మాంసం అమ్మ‌కాల‌ను ప్రొత్స‌హిస్తోందని, ఆ శాఖ‌కు అలాంటి అధికారమేమీ లేద‌ని సుప్రీంకు రాసిన లేఖలో తెలిపింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి దృష్ట్యా మాంసం అమ్మ‌కాల‌పై నిషేధం విధించాలని సుప్రీంను కోరింది. ఇక క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందిందని అనుమానిస్తున్న వుహాన్ మాంసం మార్కెట్‌ను చైనా ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సీల్ చేసింది.

Must Read:

మ‌రోవైపు దేశవ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు ఇప్ప‌టివ‌ర‌కు 23,200కుపైగా న‌మోదయ్యాయి. అలాగే 700 మందికిపైగా మ‌ర‌ణించారు. మ‌న‌దేశంలో క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు గ‌త నెల 25 నుంచి లాక్‌డౌన్‌ను విధించిన సంగ‌తి తెలిసిందే. ఇండియాలో క‌రోనా పాజిటివ్ కేసుల్లో మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here