భార్యను బెదిరించబోయి… మెడకు తాడు బిగుసుకుని వ్యక్తి మృతి

ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన తన భార్యను స్వస్థలానికి రప్పించేందుకు ఆత్మహత్య నాటకమాడిన ఓ వ్యక్తి నిజంగానే ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లాలో జరిగింది. భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ నువ్వు రాకపోతే ఉరేసుకుంటానని బెదిరించాడు. అయితే ప్రమాదవశాత్తూ కాలు జారడంతో తాడు మెడకు బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడు.

Also Read:

తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన జి.గణేష్‌ (35) భార్య బతుకుదెరువు కోసం 5 నెలల కిందట కువైట్‌ వెళ్లింది. ఈ క్రమంలోనే రోజూ ఫోన్లో మాట్లాడుకునే సమయంలో ఇద్దరికీ మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆమె రెండు నెలలుగా భర్తకు డబ్బులు పంపించడం లేదు. దీంతో భార్యను తిరిగొచ్చేయాలంటూ అతడు ఒత్తిడి తెస్తున్నాడు. అయితే తాను ఇప్పుడప్పుడే ఇంటికి రానని ఆమె తెగేసి చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు.

Also Read:

ఆదివారం రాత్రి భార్యకు వీడియో కాల్ చేసిన గణేశ్ ‘నువ్వు ఇంటికి రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ ఫ్యాన్‌కు ఉరేసుకుంటున్నట్లు నాటకమాడాడు. అదే సమయంలో ప్రమాదవశాత్తూ అతడి కాలు జారి తాడు మెడకు బిగుసుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అంతా సెల్‌ఫోన్లో రికార్డ్ అయింది. బంధువుల ఫిర్యాదుతో ఎస్ఐ సతీష్ సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here