భర్తను చంపి నదిలో పాతిపెట్టింది.. నిజామాబాద్‌లో మహిళ ఘాతుకం

తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ కట్టుకున్న భర్తనే దారుణంగా చంపేసి నదీ తీరంలో పూడ్చిపెట్టేసింది. జిల్లాలోని మండలం మందర్నా గ్రామానికి చెందిన మహిళ రెండ్రోజుల క్రితం భర్తను హత్య చేసింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని మంజీర నది తీరంలో పూడ్చిపెట్టింది. నీ భర్త కనిపించడం లేదు.. ఏమయ్యాడని స్థానికులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది.

Also Read:

దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా భర్తను తానే హత్య చేసి పూడ్చిపెట్టానని చెప్పింది. దీంతో పోలీసులతో పాటు స్థానికులు షాకయ్యారు. నిందితురాలు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు నదీ తీరానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు కారణంగా కుటుంబ కలహాలా? లేక అక్రమ సంబంధమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భర్తను ఆమె ఒక్కతే చంపిందా? లేక ఎవరైనా సాయం చేశారా? అన్న దానిపైనా పోలీసులు విచారిస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here