బాయ్స్‌ లాకర్ రూమ్‌లో కొత్త ట్విస్ట్… అబ్బాయిలతో చాట్ చేసింది అమ్మాయే

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బాయ్స్‌ లాకర్ రూమ్’ కేసులో మరో కొత్త ట్విస్ట్ బయటపడింది. తమ క్లాస్‌మేట్స్ అమ్మాయిల బాడీ షేమింగ్‌పై మాట్లాడుతూ గ్యాంగ్ రేప్ చేద్దాం అంటూ కొందరు విద్యార్థులు చేసిన గ్రూప్ చాట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ అెలయ్యే నిజాలు బయటపడ్డాయి. ఓ టీనేజీ అమ్మాయే అబ్బాయిగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అబ్బాయిలతో చాట్ చేసినట్లు విచారణలో తేలింది. తన శరీరంపై తానే అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, దానికి అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని తాను ఈ పని చేసినట్లు విచారణలో పేర్కొన్నట్లు ఢిల్లీ సైబర్ పోలీసులు తెలిపారు.

అబ్బాయిగా ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసిన అమ్మాయి తన పేరు సిద్దార్థ్‌గా పరిచయం చేసుకుంది. తన శరీరంపై ఆమే అసభ్యకర వ్యాఖ్యలు చేసింది. దానికి అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడో దాన్ని బట్టి తన క్యారెక్టర్ తెలుసుకోవచ్చని సదరు టీనేజీ అమ్మాయి విచారణలో తెలిపింది. బాయ్స్ లాకర్ రూం పేరుతో కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ అకౌంట్ క్రియేట్ చేశారు. తమ క్లాస్‌మేట్స్ అమ్మాయిల బాడీ షేమింగ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ చాటింగ్ చేసిన ఘటన అందరికీ తెలిసిందే.

ఈ గ్రూప్‌లో వారంతా ఢిల్లీలోని ప్రముఖ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులే. దీంతో గ్యాంగ్ రేప్ చేద్దామంటూ సదరు విద్యార్థులు చాట్ చేసిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరంతా 18 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్నవారే. అమ్మాయిల ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా గ్రూప్‌లో చర్చించుకున్నారు. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు 24 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తుండగా ఒక్కొక్క నిజాలు బయటపడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here