ప్రపంచానికి భారత్ నిరూపించి చూపింది ఇదే.. 21వ శతాబ్దం మనదే: మోదీ

క రోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం నెలకొన్న వేళ యావత్ ప్రపంచానికి భారత్ దిశానిర్దేశం చేస్తోందని అన్నారు. ఒకే ఒక వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోందన్నారు. విశ్వంలో సంకటస్థితిని ఎదుర్కొంటోందని.. ప్రాణాలను రక్షించుకోవడానికి యుద్ధమే చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి సంకట స్థితిని ఎప్పుడూ చూడలేదు, వినలేదని వ్యాఖ్యానించారు. కానీ, ఓడిపోవడం మానవ నైజం కాదని.. ఈ సంక్షోభంలో మన సంకల్పం మరింత బలపడాలని పిలుపునిచ్చారు.

మంగళవారం (మే 12) రాత్రి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమిస్తూ.. రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. గెలిచి తీరాల్సిన యుద్ధంలో భారత్ ప్రపంచానికే వెన్నుదన్నుగా నిలబడిందని పేర్కొన్నారు.

‘21వ శతాబ్దం భారత దేశానిదే అని చెప్తుంటే విన్నాం. కరోనా సంక్షోభ సయమంలో అది చూస్తున్నాం. ఈ సంక్లిష్ట సమయంలో ప్రపంచ దేశాలను ఆదుకునే అవకాశం వచ్చింది. భారత్ ఆపదను అవసరంగా మార్చుకుంటుందని ప్రపంచానికి నిరూపించి చూపించింది’ అని మోదీ అన్నారు. భవిష్యత్తులో దేశం రాణించడానికి అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. భారతీయుల్లో స్ఫూర్తి నింపారు.

Must Read:

సంక్షోభ సమయంలో భారత్ ఒకే దేశంగా నిలబడి ఓ సందేశాన్ని ఇచ్చిందని మోదీ అన్నారు. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన రోజున పీపీఈ కిట్ లేదని, ఎన్-95 మాస్కులు నామమాత్రమేనని మోదీ తెలిపారు. కానీ, ప్రస్తుతం దేశంలో రోజూ 2 లక్షల పీపీఈ కిట్లు, మరో 2 లక్షల ఎన్-95 మాస్కుల ఉత్పత్తి జరుగుతోందని మోదీ చెప్పారు. భారత్ నిర్ణయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

2000 సంవత్సరంలో Y2K సమస్య వచ్చినప్పుడు భారత దేశ సాంకేతిక నిపుణులే ఆ సమస్యకు పరిష్కారం చూపారని మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని కచ్‌లో సంభవించిన భూకంపం తీవ్ర నష్టాన్ని నింపితే.. ఆ ప్రాంతం నేడు మళ్లీ లేచి నిలబడిందని గుర్తు చేశారు. టీబీ, క్షయ, పోలియో లాంటి అనుభవాలు కూడా ప్రపంచానికి ఇలాంటి పాఠాలే నేర్పించాయని చెప్పారు. ప్రపంచానికి భారత్ యోగాను కానుకగా అందించిందని పేర్కొన్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here