పాక్ ఎయిర్‌ ఫోర్స్‌లో తొలి హిందూ పైలట్

పా కిస్థాన్ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిందూ వ్యక్తి ఆ దేశ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్‌గా నియామకం పొందాడు. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన రాహుల్‌ దేవ్‌ అనే యువకుడు ఈ ఘనత సాధించాడు. పాక్ వైమానిక దళంలో జనరల్‌ డ్యూటీ పైలట్‌గా హిందూ మతానికి చెందిన రాహుల్ దేవ్ నియమితులైనట్లు ఆ దేశ పత్రికల్లో పతాక శీర్షికలతో ప్రచురించారు. అంతర్జాతీయ మీడియా కూడా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రచురించింది.

పాకిస్థాన్‌లో హిందువులు అత్యధికంగా నివసించే సింధ్‌ ప్రావిన్స్‌లోని అతిపెద్ద జిల్లా థార్పార్కర్‌లోని ఓ కుగ్రామంలో పుట్టిన రాహుల్ దేవ్.. ఉన్నత విద్య అభ్యసించి ఈ స్థాయికి చేరుకున్నట్లు పత్రికా కథనాల్లో పేర్కొన్నారు. పాక్‌ వైమానిక దళంలో రాహుల్‌ దేవ్‌ నియామకంపై ఆల్‌ పాకిస్థాన్‌ హిందూ పంచాయత్‌ సెక్రటరీ రవి దవానీ సంతోషం వ్యక్తం చేశారు.

దేశంలో మైనారిటీ వర్గానికి చెందిన అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులుగా, సైనిక దళంతో పాటు ఇంకా వివిధ రంగాల్లో సేవలను అందిస్తున్నారని దవానీ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో హిందూ మతానికి చెందిన చాలా మంది వైద్యులుగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. పాకిస్థాన్‌ ప్రభుత్వం మైనారిటీ వర్గాలపై దృష్టి పెడితే, భవిష్యత్తులో అనేక మంది రాహుల్‌ దేవ్‌లు దేశసేవకు సిద్ధమౌతారని ఆయన అన్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here