పరిస్థితి చేజారుతుందా? 11 రోజులకు పడిపోయిన కేసుల రెట్టింపు సమయం!

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ కొనసాగుతున్నా మహమ్మారి తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య వృద్ధిరేటు 6.6 శాతం వేగంతో పెరుగుతోంది. అంతేకాదు, కేసులు రెట్టింపు కావడానికి పట్టిన సమయం కూడా తగ్గతూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. మే 2కి ముందు 15 రోజులతో పోల్చితే ప్రస్తుతం 11 రోజులకు పడిపోయిందని పాజిటివ్ కేసుల వృద్ధి రేటు 4.8 శాతంగా ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, గతంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యుడిగా ఉన్న షమికా రవి వ్యాఖ్యానించారు.

గురించి గణాంకాలను విశ్లేషిస్తూ రవి రోజూ ట్వీట్ చేస్తుంటారు. ఇవి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడమే కాదు.. వీటిని ప్రభుత్వం కూడా ఉపయోగిస్తుంది. కాగా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు లాంటి రాష్ట్రాల వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. మరణాల రేటు కూడా పెరుగుతున్నా, కాంటాక్ట్-ట్రేసింగ్, టెస్టింగ్ కోసం నిర్దిష్ట వ్యూహం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేరళలోని కాసర్‌గడ్ జిల్లాలో 20వేల మందికి పరీక్షలు నిర్వహించగా 100 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.. అదే ముంబైలో 6,000 నమూనాలను పరీక్షిస్తే 100 మందికి వైరస్ ఉన్నట్టు తేలిందని అన్నారు.

గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. కంటెయిన్‌మెంట్, కాంటాక్ట్-ట్రేసింగ్, టెస్టింగ్ వైరస్ నియంత్రణకు సహాయపడతాయి. నియంత్రణ, కాంటాక్ట్-ట్రేసింగ్ పేలవంగా ఉంటే, పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉంటాయి. రాష్ట్రాలు ఒక వ్యూహాన్ని రూపొందించి, అది ఖచ్చితంగా అమలు చేయడానికి నిర్ధారించుకోవాలని ఆమె సూచించారు. ఇప్పటి వరకు విశ్లేషణ కోసం తీసుకున్న గణాంకాలు.. కేసులు రెట్టింపు రేటు పెరుగుతున్నట్టు సూచిస్తున్నాయని పేర్కొంది.

మహారాష్ట్ర చాలా ఘోరంగా విఫలమవుతోందని, ఇది జాతీయ సగటును ప్రభావితం చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాంటాక్ట్-ట్రేసింగ్‌పై రాష్ట్రాలు దృష్టి సారించాలని, పాజిటివ్ కేసుల ద్వారా వ్యాధి బారినపడిన వారిని గుర్తించి, విస్తృత వ్యాప్తిని అరికట్టడానికి క్లినికల్ మేనేజ్‌మెంట్‌ను నిర్వహించాలని సూచించారు.

ఏప్రిల్ 25 నుంచి మే 5 వరకు జాతీయ కోవిడ్ -19 మరణాల రేటు 1.31 కాగా, మహారాష్ట్ర, గుజరాత్‌లో 5 కంటే ఎక్కువ అని పేర్కొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా కొన్ని రాష్ట్రాలు తగిన నిఘా, కాంటాక్ట్-ట్రేసింగ్, పాజిటివ్ కేసుల రిపోర్టింగ్ చేయకపోవడం, క్లినికల్ మేనేజ్‌మెంట్‌లో జాప్యం మరణాల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here