దొంగ కోతి! ఏటీఎంపై దాడి.. సీసీ కెమెరా చూస్తే షాక్!

దే శ రాజధాని ఢిల్లీలోని ఓ ఏటీఎం సెంటర్‌లో ఓ కోతి హంగామా చేసింది. లాక్‌డౌన్ వేళ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఏటీఎంలోకి ప్రవేశించిన వానరం క్యాష్ డిస్పెన్సింగ్ మెషీన్‌ను పగులగొట్టింది. మెషీన్‌లో క్యాష్ ఉందా, లేదా అన్నట్లు పరిశీలించింది. ఏటీఎం గోడలకు ఉన్న పోస్టర్లను చించేసింది. నానా బీభత్సం చేసి అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి వచ్చిన కొంత మంది స్థానికులు ఏటీఎం మెషీన్ పగులగొట్టి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. దొంగతనం జరిగి ఉంటుదనే అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఏటీఎం చిందరవందరగా ఉండటాన్ని గుర్తించారు. ఏటీఏం కేంద్రంలోని సీసీటీవీ ఫుటీజీలు పరిశీలించగా.. ఓ కోతి వచ్చి ఈ రచ్చ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో చూసి పోలీసులు నవ్వుకున్నారు. లాక్‌డౌన్‌లో ఏటీఎం ఎవరు పగులగొట్టారా అని ఆరా తీస్తున్న పోలీసులు.. వీడియోలో కోతి ఉండటాన్ని చూసి విస్తుపోయారు. ఆ వీడియోను మీడియాకు విడుదల చేశారు.

ఢిల్లీలోని సౌత్ ఎవెన్యూ ప్రాంతంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో బుధవారం (మే 6) మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తినడానికి ఏమైనా దొరుకుతాయోమోనని ఆశగా చూసి ఆ వానరం ఇలా చేయొచ్చని అనుమానిస్తున్నారు. రచ్చ చేస్తున్న దృశ్యాలను వీడియోలో వీక్షించవచ్చు..

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here