దేశంలో 24వేల మార్క్ దాటిన కరోనా కేసులు.. ఆ విషయంలో కాస్త ఊరట

దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,400కిపైగా కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. గడచిన వారం రోజులతో పోల్చితే పాజిటివ్ కేసుల నమోదు తక్కువే. అత్యధికంగా మహారాష్ట్రలో 391 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 6,817కి చేరింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 59 మంది కరోనా వైరస్ బాధితులు చనిపోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. అక్కడ కరోనా మృతుల సంఖ్య 300 దాటింది. ముంబయి నగరంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేశంలో పాజిటివ్ కేసుల పెరుగుదల 8 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24,400కి చేరింది. మహమ్మారి బారినపడి మొత్తం 780 మంది మృతిచెందారు.

గ త 24 గంటల్లో మొత్తం 1,408 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో అత్యధికంగా 391, గుజరాత్‌లో 191, మధ్యప్రదేశ్ 159, ఢిల్లీలో 138, ఉత్తరప్రదేశ్ 111 కేసులు వెలుగుచూశాయి. దేశంలో మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌లో ప్రాణనష్టం అధికంగా ఉంది. ఇప్పటి వరకూ అక్కడ 127 మంది చనిపోయారు. దీని తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (92), ఢిల్లీ (53), రాజస్థాన్ (32), ఆంధ్రప్రదేశ్ (29), తెలంగాణ (25), ఉత్తరప్రదేశ్ (25), తమిళనాడు (22), కర్ణాటక (18), పశ్చిమ్ బెంగాల్ (18), పంజాబ్ (17), జమ్మూ కశ్మీర్ (5), కేరళ, హర్యానా, ఝార్ఖండ్ 3, బిహార్, చత్తీస్‌గఢ్ రెండేసి చొప్పున మరణాలు చోటుచేసుకున్నాయి.

మధ్యప్రదేశ్‌లో ఐదు రోజుల తర్వాత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తవి 159 సహా మొత్తం కేసుల సంఖ్య 1,846గా నమోదయ్యింది. గుజరాత్‌లోనూ మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. శుక్రవారం 191 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 2,800 దాటింది. ఢిల్లీలో 138 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా మొత్తం కేసులు 2,514కి చేరాయి. రాజస్థాన్ సైతం 2వేల మార్క్‌ దాటేసింది. శుక్రవారం ఇక్కడ 70 కేసులు నమోదు కాగా అక్కడ ప్రస్తుతం 2,034 మంది వైరస్ బారినపడ్డారు. తమిళనాడులో మరో 72 మందికి శుక్రవారం పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో బాధితుల సంఖ్య 17,55కి చేరింది. ఉత్తరప్రదేశ్‌లో 111 కొత్త కేసులు బయటపడగా.. అక్కడ మొత్తం కేసులు 1,521గా నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 62 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 955కి చేరింది. మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య 29కు పెరిగింది. తెలంగాణలో కంటెయిన్‌మెంట్‌ జోన్ల నుంచి తప్ప కొత్తగా ఇతర ప్రాంతాల నుంచి కరోనా పాజిటివ్‌ కేసులు లేవు. కేవలం 13 కేసులు మాత్రమే శుక్రవారం నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 983గా నమోదయ్యింది. మొత్తంగా తెలంగాణలో గత నాలుగు రోజుల నుంచి కొత్త కేసులు తగ్గుతున్నాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య 25కి చేరుకుంది.

పశ్చిమ్ బెంగాల్‌‌లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో అక్కడ కొత్తగా 58 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 514కి చేరింది. కర్ణాటకలో 474, జమ్మూ కశ్మీర్ 454, కేరళ 450, పంజాబ్ 298, హర్యానా 275, బీహార్ 223, ఝార్ఖండ్ 59, ఉత్తరాఖండ్ 48, హిమాచల్‌ప్రదేశ్ 40, అసోం 36, చత్తీస్‌గఢ్ 36, చండీగఢ్ 27, అండమాన్ 29, లడఖ్ 18 కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here