దేశంలో కరోనా నుంచి కోలుకున్న 10 వేల మంది

దే శంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నా.. అటు ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అదే స్థాయిలో పెరుగుతుండటం ఊరటనిస్తోంది. దేశంలో ఇప్పటివరకు కోవిడ్-19 మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 10 వేలు దాటింది. శనివారం (మే 2) సాయంత్రం 5 గంటల వరకు కరోనా నుంచి 10,018 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2411 పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగించే అంశం. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 37,776కు చేరింది.

దేశంలో రికవరీ రేటు 26.51 శాతంగా ఉంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో 71 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,223కు చేరింది. ప్రస్తుతం 26,535 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Also Read:

దేశంలో 1000కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య 9కి చేరింది. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. 11,506 కేసులతో ఆ రాష్ట్రం తొలి స్థానంలో ఉంది. కరోనాతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు 485 మంది మరణించారు. మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌లో కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. గుజరాత్‌లో ఇప్పటివరకు 4721 కేసులు నమోదు కాగా.. 236 మంది మరణించారు.

దేశరాజధాని ఢిల్లీలో 3738 కేసులు నమోదయ్యాయి. 61 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో 2719 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 145 మంది మరణించారు. గుజరాత్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రాలు వెయ్యికి పైగా కేసులు కలిగిన జాబితాలో ఉన్నాయి.

Must Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here