తమిళనాడులో టెన్షన్ టెన్షన్.. 121 మంది చిన్నారులకు కరోనా

దేశవ్యాప్తంగా పలుచోట్ల నమోదవుతున్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధిక మంది చిన్నారులే ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. కరోనా కేసులు పెరుగుతున్న తమిళనాడులో ఆందోళన ఇప్పటి వరకు 2,058 మంది కరోనా బారిన పడ్డారు. అయితే వారిలో 12 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులు 121 మంది వరకు ఉన్నారన్న వార్త ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తోంది. నిజానికి చిన్నారులపై వైరస్ ప్రభావం అంతగా ఉండదన్న వార్తలు ఇటీవల వినిపించాయి.అయితే, ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఏకంగా 121 మంది చిన్నారులకు వైరస్ సంక్రమించడం ఆందోళనకు గురిచేస్తోంది.

తమిళనాడులో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,392 మంది పురుషులు కాగా, 666 మంది మహిళలు కరోనా బారిన పడ్డారు. గత 24 గంటల్లో చెన్నైలో 103 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 673కి పెరిగింది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 1,128 మంది కోలుకున్నారు. 25 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఒక్క కృష్ణగిరి జిల్లాలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ కరోనా ప్రభావం ఉన్నట్టు అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here