తండ్రీకొడుకుల కిరాతకం.. తోడబుట్టిన తమ్ముడి సహా ఇద్దరి దారుణ హత్య

పొలం బాట వివాదం రెండు నిండు ప్రాణాలు బలితీసుకుంది. ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడినే అంతమొందించాడు అన్న. అడ్డొచ్చిన అతని బావమరిదిని కూడా పొడిచేశాడు. కొడుకు సాయంతో కిరాతకంగా ఇద్దరినీ చంపేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని జిల్లాలో చోటుచేసుకుంది. గింజీ పరిధిలోని తచ్చంపట్టు గ్రామానికి చెందిన ముత్తుక్రిష్ణన్ (50), ఏలుమలై (48) అన్నదమ్ములు.

గత కొద్దికాలంగా ఇద్దరి మధ్య ఆస్తి వివాదం నడుస్తోంది. పూర్వీకుల నుంచి సంక్రమించిన 59 సెంట్ల భూమిని ఇద్దరూ సమంగా పంచుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. పొలం దారి విషయంలో తరచూ వివాదాలు జరుగుతున్నాయి. ఆ దారిని తమ్ముడు ఏలుమలై, అతని బావమరిది మురుగన్ (45) రాకపోకలకు వినియోగిస్తుండడంపై ముత్తుక్రిష్ణన్ అభ్యంతరం చెప్పాడు.

Also Read:

మరోమారు అన్నదమ్ముల మధ్య వివాదం రేగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అన్న ముత్తుక్రిష్ణన్ అతని కొడుకు తంగమణి(20)తో కలసి తమ్ముడు ఏలుమలైని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. అడ్డొచ్చిన తమ్ముడి బావమరిది మురుగన్‌ని కూడా పొడిచేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. పొలం బాట వద్ద తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానగా మారి ఇద్దరి హత్యకు దారితీసింది. పోలీసులు కేసు నమోదు చేసి తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here