ట్విట్టర్ ఉద్యోగులకు నిరవధికంగా వర్క్ ఫ్రమ్ హోం.. సంచలన నిర్ణయం

కారణంగా ప్రపంచంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పని సంస్కృతిలో అపూర్వమైన మార్పులకు కారణమయ్యింది. మెజార్టీ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయడానికి అనుమతించాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులలో చాలా మంది ముగిసిన తర్వాత కూడా ఇంటి నుంచే పనిచేయాలని తెలిపింది. దీంతో శాశ్వతంగా ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయడానికి అనుమతించిన తొలి సంస్థగా నిలిచింది.

కరోనా మహమ్మారి ప్రపంచ్యవాప్తంగా 212 దేశాలకు విస్తరించగా.. మొత్తం 4.4 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. దీంతో కోవిడ్-19ను కట్టడిచేయడానికి చాలా దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. ప్రస్తుతం కొన్ని దేశాలు ఆంక్షలను సడలించి, ఆర్ధిక కార్యకలాపాల పునఃప్రారంభానికి అనుమతించాయి.

సెప్టెంబరులోపు వివిధ ప్రాంతాల్లోని తమ కార్యాలాయాలను తెరిచే పరిస్థితులు లేవని, ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలా? వద్దా? అనేది ఉద్యోగులు ఎంపికచేసుకోవాలని ట్విట్టర్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ఏడాది మధ్యలో మూడు నుంచి ఆరు నెలల పాటు ఆఫ్రికాలోని పర్యటించాలని ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే భావించిన… ఆరోగ్య సంక్షోభం కారణంగా తాను ఈ ఆలోచనను పునః పరిశీలిస్తున్నట్టు ఇటీవల వెల్లడించారు. కొన్ని అత్యవసర సందర్భాల్లో మినహా సెప్టెంబరులోపు ఎలాంటి బిజినెస్ ట్రిప్స్ ఉండబోవని ట్విట్టర్ వెల్లడించింది.

కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించి ట్విట్టర్‌లో తప్పుడు ప్రచారం ముమ్మరంగా సాగడంతో దీనిని ఎదుర్కోవడంలో ఆ సంస్థ ఒత్తిడిలో ఉంది. ఇదిలా ఉండగా ఇంటి నుంచి నిరవధికంగా పని చేసే ఉద్యోగుల సంఖ్యను మాత్రం ఖచ్చితంగా వెల్లడించలేదు. ఇప్పటికే ఫేస్‌బుక్, గూగుల్ లాంటి సంస్థలు తమ ఉద్యోగుల్లో అధిక శాతం ఇంటి నుంచి పనిచేయడానికి అనుమతించింది.

మహమ్మారి ఉద్ధృతంగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఇంటి నుంచి పనికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి మే 22 న ఒక రోజు సెలవు తీసుకోవాలని ఉద్యోగులను కోరినట్లు గూగుల్ గత వారం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here