టీవీ రిమోట్ కోసం చెల్లితో గొడవ.. అక్క ఆత్మహత్య.. కడపలో విషాదం

చిన్నచిన్న కారణాలకే కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్య వంటి దారుణాలకు తెగబడుతున్నారు. అలాంటి ఘటనే తాజాగా జిల్లాలో చోటుచేసుకుంది. టీవీ రిమోట్ కోసం చెల్లితో గొడవపడిన అక్క.. ఆవేశంలో ఊహించని దారుణానికి పాల్పడింది. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మునిసిపాలిటీ పరిధిలోని మేదర కాలనీలో జరిగింది.

అక్కచెల్లెళ్ల మధ్య తలెత్తిన వివాదం ఒకరి నిండుప్రాణాన్ని బలితీసుకుంది. తీవ్ర మనస్థాపం చెందిన అక్క సాయిలక్ష్మి(13) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోకి వెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఉరికి వేలాడుతున్న కూతురిని చూసి ఆ తల్లిదండ్రుల గుండె బద్దలైంది. క్షణికావేశంలో ఉసురు తీసుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చింది.

Also Read:

సమాచారం అందుకున్న బద్వేల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలిక డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here