జూన్-జులైలో గరిష్టానికి చేరనున్న కరోనా కేసులు: ఎయిమ్స్ డైరెక్టర్

దేశంలో కరోనా కేసులు జూన్, జులై నెలల్లో గరిష్టానికి చేరే అవకాశం ఉందని ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. మోడలింగ్ డేటా, దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తీరును పరిశీలించి ఈ విషయాన్ని చెబుతున్నట్లు ఆయన తెలిపారు. కానీ కేసుల సంఖ్య పెరగడాన్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయన్న గులేరియా.. ఈ అంచనాలు ఎంత మేర నిజయం అవుతాయి, లాక్‌డౌన్ పొడిగించిన ప్రభావం ఎంత మేర ఉంటుందనేది టైం గడిస్తేనే చెప్పగలమన్నారు.

మన దేశంలో కరోనా కేసులు మే నెల మధ్య నాటికి పీక్ స్టేజ్‌కు చేరుకుంటాయని గతంలో అంచనాలు వెలువడ్డాయి. కానీ లాక్‌డౌన్‌ను పొడిగించడంతో కరోనా కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతోంది.

భారత్‌లో ఇప్పటి వరకూ దాదాపు 53 వేల కోవిడ్ కేసులు నమోదు కాగా.. 1783 మంది చనిపోయారు. 15,267 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. ఇక్కడ 16,758 మంది కోవిడ్ బారిన పడగా.. 651 మంది చనిపోయారు. గుజరాత్‌లో 6625 కేసులు నమోదు కాగా.. 396 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 5532 కేసులు నమోదు కాగా.. 65 మంది మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here