క‌రోనా వేళ‌.. ఆ పని చేస్తే మూడేళ్లదాక జైలు.. ఆర్డినెన్స్ జారీ

క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్త‌గా వేగంగా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 27,200కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. మ‌రోవైపు 850 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా త‌మిళ‌నాడులో కరోనా మృతులకు అంత్య‌క్రియ‌ల‌కు చేసే విష‌యంలో గొడ‌వ జ‌రిగింది. ఒక డాక్ట‌ర్ క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోగా.. ఆయన అంత్య‌క్రియ‌లు శ్మశానవాటికలో జ‌ర‌ప‌వ‌ద్ద‌ని జ‌నం పెద్ద‌యెత్తున ఆందోళ‌న చేశారు. అలాగే రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. ఈ నేప‌థ్యంలో అంత్య‌క్రియ‌ల‌ను అడ్డుకునేవారిపై త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అలాంటివారికి మూడేళ్ల దాకా శిక్ష విధించ‌నున్న‌ట్లు చ‌ట్టంలో పొందుప‌రించింది.

Must Read:

తాజాగా చెన్నైలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా సిమోన్ హెర్య్యూల‌స్ అనే వైద్యుడు చనిపోయాడు. ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించేందుకు స్థానికి ప్ర‌జ‌లు అడ్డుకున్నారు. పోలీసుల స‌మ‌క్షంలోనే దాడులు చేశారు. ఎవ‌రూ అందుబాటులో లేక‌పోవ‌డంతో, చివ‌ర‌కు మ‌రో డాక్ట‌ర్ ప్ర‌దీప్ కుమార్‌.. సిమెన్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

Must Read:

దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించిన మ‌ద్రాస్ హైకోర్టు.. మృతుల‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన అంత్య‌క్రియలు క‌ల్పించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం తాజా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఇక క‌రోనా కార‌ణంగా త‌మిళ‌నాడు అల్లాడుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1880కిపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే 24 మంది మ‌ర‌ణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here