క‌రోనా అప్‌డేట్‌.. లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌కు ఢిల్లీ ఓకే

క‌రోనా వైర‌స్‌ను అడ్డుకోవ‌డానికి కేంద్రం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈనెల 14 నుంచి ఈ లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాల్లో కొన్ని మిన‌హాయింపుల‌ను ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గ‌దర్శ‌కాల‌ను అమ‌లు చేసేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం తాజాగా అంగీక‌రించింది. అత్య‌వ‌సరం కాని దుకాణాలను తెరిచి ఉంచేందుకు అనుమ‌తిచ్చింది. అయితే ఇవ‌న్నీ నాన్ కంటైన్‌మెంట్ జోన్ల‌లోనే అమ‌ల్లో ఉంటాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది.

Must Read:

ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా 92 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. ఈ జోన్ల‌లో మాత్రం లాక్‌డౌన్ నిబంధ‌న‌లను క‌ఠినంగా అమ‌లు చేస్తామ‌ని ఢిల్లీ అధికారులు తెలిపారు. తెరిచి ఉంచిన షాపుల్లో సోష‌ల్ డిస్టెన్సింగ్‌ను అమ‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు బాగా న‌మోద‌వుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ ఒక‌టి. ఇప్ప‌టివ‌ర‌కు 2500కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 50మందికిపైగా ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా మ‌హారాష్ట్ర (6800), గుజ‌రాత్ (2800) త‌ర్వాత అత్య‌ధికంగా ఢిల్లీలోనే క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here