క‌రోనాకు చెక్‌.. కర్నాటకలో క్లినికల్ ట్రయల్స్ షురూ

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలో కొన్వ‌ల్‌సెంట్ ప్లాస్మా థెర‌పీని చాలా దేశాల్లో వాడుతున్నారు. చివరిదశలో ఉన్న క‌రోనా రోగుల‌పై ఈ థెర‌పీని ప్ర‌యోగించ‌గా.. చాలా మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయి. ఈక్ర‌మంలో మ‌న‌దేశంలో ఇప్ప‌టికే ఈ థెర‌పీ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభించారు. ఈక్ర‌మంలో క‌ర్ణాట‌క‌లోనూ ప్లాస్మా థెర‌పీని స్టార్ట్ చేసినట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

Must Read:

రాష్ట్రంలో ప్లాస్మా థెర‌పీ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌ని క‌రోనా ఇంచార్జ్ మినిస్ట‌ర్‌, విద్యా శాఖ మంత్రి కే సుధాక‌ర్ ట్వీట్ చేశారు. క‌రోనా వైర‌స్‌తో తీవ్రంగా బాధ‌ప‌డుతున్న రోగుల‌కు ఈ చికిత్స ద్వారా ఉప‌శ‌మ‌నం దొరికే అవ‌కాశ‌ముంద‌ని ఆయన ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Must Read:

ఇప్ప‌టికే చాలా దేశాలలో ప్లాస్మా థెర‌పీ ప‌ద్ధ‌తి విజ‌య‌వంత‌మైంది. వెంటిలెట‌ర్‌పై ఉన్న రోగులు కోలుకున్న దాఖ‌లాలు ఉన్నాయి. మ‌న‌దేశంలోనూ ఈ ప‌ద్ధ‌తిని క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను ఇప్ప‌టికే కేర‌ళ‌, గుజ‌రాత్ రాష్ట్రాల‌లో వాడుతున్నారు. ఫ‌లితాలను బేరీజు వేసిన అనంత‌రం దీనిపై కేంద్రం త్వ‌ర‌లోనే ఓ నిర్ణ‌యం తీసుకోనుంది. ఇక క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వైర‌స్‌కు సంబంధించి 28.46 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ల‌క్షా 97 వేల మంది మ‌ర‌ణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here