కరోనా నుంచి కోలుకున్న బ్రిటిష్ ప్రధాని.. పగ్గాలెప్పుడు చేపడుతున్నారంటే?

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్ర‌మంలో బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ కూడా సోకిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వైర‌స్ నుంచి కోలుకుని, పూర్తి ఆరోగ్యంగా జాన్స‌న్ మారారు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం (ఏప్రిల్ 27) నుంచి ఆయ‌న తిరిగి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ప్ర‌స్తుతం సంక్షోభ ప‌రిస్థితుల్లో బోరిస్ తిరిగి ప‌గ్గాలు చేప‌ట్ట‌డం దేశానికి చాలా మంచిద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. బోరిస్ గైర్హాజారీలో ఆయ‌న స్థానంలో ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రించిన విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి డొమినిక్ రాబ్ కూడా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

Must Read:

బోరిస్ లేని వేళ తాత్కాలిక ప్ర‌ధానిగా తను త‌గిన న్యాయం చేయ‌లేక‌పోయాన‌ని రాబ్ తెలిపారు. వీలైనంత త్వ‌రగా ప్ర‌ధానిగా బోరిస్‌ను తిరిగి చూడాల‌నుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. ఇక క‌రోనా వైర‌స్ కార‌ణంగా మూడువారాల‌పాటు జాన్స‌న్ క్వారంటైన్‌లో గ‌డిపారు. ఈక్ర‌మంలో మూడు రోజుల‌పాటు ఐసీయూలో జాన్స‌న్‌కు చికిత్స అందించారు. మ‌రోవైపు వైరస్ బారి నుంచి కోలుకున్నాక జాన్స‌న్ బిజీగా గ‌డుపుతున్నారు. ఇప్ప‌టికే బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్‌, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, యూకే సీనియ‌ర్ మంత్రుల‌ను క‌లిశారు. దేశంలో కోవిడ్ తీవ్ర‌త‌ను త‌గ్గించేందుకు స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు యూకేలో లక్షా 48వేల పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే 20వేల మందికిపైగా మ‌ర‌ణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here