కరోనా అప్‌డేట్‌: ఒక్కో వ్య‌క్తిపై క‌్వారంటైన్ ఖ‌ర్చు ఎంతో తెలుసా..?

క‌రోనా వైర‌స్ రాజ‌స్థాన్‌ను అత‌లాకుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు ఆ రాష్ట్రంలో 1900కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలు ఉన్న‌వారితోపాటు పాజిటివ్ రోగులకు చికిత్స అందించేందుకు కేంద్రాల్లో వారిని ఉంచుతున్న సంగ‌తి తెలిసిందే. క్వారంటైన్‌లో ఉండే రోగుల‌పై రోజుకు పెట్టే ఖ‌ర్చును రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం తాజాగా నిర్ధారించింది. ఒక‌రోజుకు ఒక వ్య‌క్తిపై గ‌రిష్టంగా2,440 రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేయాల‌ని ఉత్వ‌ర్వులు జారీ చేసింది.

Must Read:

ఇందులో 600 రూపాయ‌ల‌ను రోగి ఆహారంపై ఖ‌ర్చుచేయనున్నారు. రూ.100 బ్రేక్‌ఫాస్ట్‌, రూ.180 చొప్పున లంచ్‌, డిన్న‌ర్ కోసం ఖ‌ర్చు చేస్తారు. రూ.80 నీటి కోసం, రూ.60 టీ, శ్నాక్స్ కోసం కేటాయించారు. అలాగై లినైన్‌, లాండ్రీపై రూ.60ను ఖ‌ర్చు చేయ‌నున్నారు. అలాగే రూ.550ను క్లీనింగ్‌, డిసిన్ఫెక్ష‌న్‌కు కోసం కేటాయించారు.

Must Read:

ఇక రూ.500ను క్వారంటైన్‌లోని స్టాఫ్ ఆహారం కోసం కేట‌యించ‌గా.. హెల్త్ వ‌ర్క‌ర్ల పీపీఈ కోసం రూ.600ను ఖ‌ర్చుచేయ‌నున్నారు. అలాగే రూ.100 స్ప్రేయింగ్ మిష‌న్ కోసం కేటాయించ‌గా.. రూ.30ను గార్డ్ కోసం ఖ‌ర్చు చేయ‌నున్నారు. తాజా ఉత్వ‌ర్వ‌లపై రాష్ట్ర మెడిక‌ల్‌, ఆరోగ్య శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..గార్డుల‌పై ఖ‌ర్చు, హెల్త్ వ‌ర్క‌ర్ల పీపీఈలు, సిబ్బంది ఆహ‌ర ఖ‌ర్చును వ్య‌క్తిగ‌త ఖ‌ర్చుగా నిర్వ‌హించ‌డం టెక్నిక‌ల్‌గా స‌రికాద‌ని, అయిన‌ప్ప‌టికి కొన్ని ప్రాంతాల్లో ఈ ఖ‌ర్చులు చాలా తక్కువ‌గా ఉన్నాయ‌ని తెలిపారు. బుధ‌వారంనాటికి రాష్ట్ర‌వ్యాప్తంగా 23,437 మంది ప్ర‌భుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here