ఇద్దరు పిల్లల తల్లితో ఎఫైర్.. పారిపోయేందుకు ప్లాన్.. కానీ చివరికి..

ప్రియురాలు తనతో వచ్చేందుకు నిరాకరించిందన్న బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మరదలితో ఆ సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. ఇద్దరు పిల్లల తల్లైన ఆమెను లేచిపోదామంటూ ఒత్తిడి చేయడంతో నిరాకరించింది. దీంతో మనస్థాపం చెందిన బావ ఉరేసుకుని చనిపోయిన ఘటన బిహార్‌లోని కైమూర్ జిల్లాలో జరిగింది.

జిల్లాలోని దరిగావ్ ప్రాంతానికి చెందిన మనీష్‌‌ సమీపంలోని నానిహాల్ గ్రామానికి చెందిన అతని మరదలిని ప్రేమించాడు. అయితే ఆమెకు గతంలోనే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఉపాధి రీత్యా ఆమె భర్త వేరే ప్రాంతానికి వెళ్లడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఏర్పడింది. మరదలితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన మనీష్ లేచిపోదామంటూ పలుమార్లు మరదలిని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించలేదు.

Also Read:

మరదలు సుముఖంగా లేకపోవడంతో మనస్థాపానికి గురైన మనీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలిపూర్‌లో ఉరేసుకుని చనిపోయాడు. మనీష్‌కి ఒక కొడుకు ఉన్నాడని.. అతను బాలిపూర్‌లో ఉంటాడని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతికి గల కారణాలపై ఆరా తీశారు.

అయితే మనీష్‌ది ఆత్మహత్య కాదని.. మరదలు, ఆమెతో సహా ఐదుగురు కలసి హత్య చేశారంటూ మృతుడి బంధువులు ఆరోపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here