ఇంట్లో ఇల్లాలు.. ఆఫీసులో ప్రియురాలు.. లాక్‌డౌన్‌తో గుట్టురట్టు

లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీలు, వ్యాపారులే కాదు.. అక్రమ సంబంధాలు పెట్టుకునే వారు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లూ ఆఫీసు పేరుతో బయటకు వెళ్లి ప్రేమ వ్యవహారాలు చక్కబెట్టిన మగమహారాజులకు లాక్‌డౌన్ సంకటంగా మారింది. తాజాగా హైదరాబాద్‌లో ఉండే ఓ వ్యక్తి పెళ్లయిన విషయం దాచిపెట్టి ఆఫీసులో పనిచేసే యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా ప్రియుడి ఆచూకీ లేకపోవడంతో ఆ యువతి నేరుగా అతడిని వెతుక్కుంటూ వెళ్లగా అసలు బండారం బయటపడింది.

Also Read:

హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో సురేశ్, శ్రుతి(పేర్లు మార్చాం) కొన్నాళ్లుగా పనిచేస్తున్నారు. వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో చాలారోజులుగా సినిమాలు, షికార్లకు తిరుగుతూ హద్దులు దాటేశారు. ఇక తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సమయంలోనే కరోనా కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రేమికులు నేరుగా కలుసుకోవడం కుదరకపోయినా ఇద్దరూ ఫోన్లు, మెసేజ్‌లు చేసుకుంటూ కాలక్షేపం చేశారు. అయితే కొద్దిరోజులుగా సురేశ్ నుంచి ఎలాంటి కాల్స్, మెసేజ్‌లు రాకపోవడం, తాను ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో శ్రుతికి ఆందోళన మొదలైంది. దీంతో కొలీగ్స్ ద్వారా ఆమె అతడి ఇంటి అడ్రస్ తెలుసుకుంది. అతడిని సర్‌ప్రైజ్ చేసేందుకు సురేశ్ ఇంటికి వెళ్లింది. కానీ అక్కడి సన్నివేశం చూసి ఆమే షాకైంది.

Also Read:

సురేశ్ సోఫాలో భార్య ఒడిలో తల పెట్టుకుని ఆమెతో ముచ్చట్లు చెబుతూ టీవీ చూస్తుండటాన్ని చూసి షాక్‌లోకి వెళ్లిపోయింది. వెంటనే తేరుకుని ఇంట్లోకి వెళ్లి అతడిని నిలదీసింది. ప్రేమ పేరుతో తన జీవితాన్ని ఎందుకు నాశనం చేశావంటూ ప్రశ్నించింది. తన భర్త బాగోతం గురించి తెలుసుకున్న సురేశ్ భార్య అతడిని గట్టిగా నిలదీసింది. ఇల్లాలు, ప్రియురాలి బారి నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ వేసిన సురేశ్… ఆత్మహత్య చేసుకుంటానంటూ రోడ్డుపైకి వచ్చి పరుగు తీశాడు. దీంతో ఇద్దరు మహిళలు పోలీసులకు ఫోన్ చేశారు. వారు కాసేపటికే అక్కడికి చేరుకుని సురేశ్‌ను పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. బాధిత మహిళల ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here