హైదరాబాద్‌ ల్యాంకో హిల్స్‌లో విషాదం..‌ 15వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య

లాక్‌డౌన్ భయంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో జరిగింది. మణికొండలోని ల్యాంకో హిల్స్‌ 15 అంతస్తు నుంచి దూకి వీర వల్లిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వీరవల్లిక 3 నెలల క్రితం వచ్చింది. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఇక్కడే ఉండిపోయింది. దీంతో ఇంటికొచ్చేస్తానని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తరుచూ చెప్పేది. అయితే రవాణా సౌకర్యం లేకపోవడంతో రావొద్దని, లాక్‌డౌన్ పూర్తికాగానే రావాలని తల్లిదండ్రులు ఆమెకు చెప్పారు.

Also Read:

అయితే కుటుంబసభ్యులపై బెంగతో వీరవల్లిక తరుచూ ఆవేదన చెందేది. లాక్‌డౌన్ పొడిగిస్తారన్న వార్తలతో మనస్తాపం చెందిన ఆమె బుధవారం ఉదయం మణికొండలోని ల్యాంకో హిల్స్ 15వ అంతస్తు పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఆమె అప్పటికే చనిపోవడంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య సమాచారాన్ని ఆమె తల్లిదండ్రులకు చేరవేశారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here