స్టూడెంట్‌తో కాపురం పెట్టిన స్కూల్ టీచర్.. గర్భం దాల్చడంతో పరార్

విద్యార్థులకు పాఠాలు బోధించి, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. కూతురి లాంటి విద్యార్థినిపై కన్నేసి మాయమాటలతో ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటన జార్ఖండ్‌లో వెలుగుచూసింది. శివారులోని గుమ్లా గ్రామానికి చెందిన మైనర్‌ బాలిక ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అక్కడ పనిచేస్తున్న టీచర్ బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో లైంగిక కోరికలు తీర్చుకున్నాడు. గతేడాది ఆమెను ఇంటి నుంచి తీసుకుపోయాడు.

Also Read:

తమ కూతురు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.65వేల నగదు కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా స్కూల్‌ టీచర్‌తో ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఆ కామాంధుడు బాలికను రాంచీ పట్టణానికి తీసుకెళ్లి గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. గత గురువారం ఉన్నట్టుండి ఆ టీచర్ బాలికను వదిలేసి పారిపోయాడు. నిండు గర్భంతో ఉన్న బాలిక అతడి కోసం వెతికి వెతికి అలిసిపోయి ఇంటి ఓనర్‌కు విషయం చెప్పింది. దీంతో అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు.

Also Read:

బాలికపై మిస్సింగ్ కేసు నమోదై ఉండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన కూతురు క్షేమంగా వస్తుందనుకున్న తల్లిదండ్రులు ఆమె శరీరంలో వచ్చిన మార్పులు చూసి షాకయ్యారు. స్కూల్‌కి వెళ్లాల్సిన వయస్సులో కడుపులో బిడ్డతో తమ ఎదుట తిరుగుతుండటం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కీచక టీచర్‌ కోసం గాలింపు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here