మొదటి భర్తను మరిచిపోలేక.. రెండో భర్తతో ఉండలేక మహిళ ఆత్మహత్య

మొదటి భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్న మహిళ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని జిల్లాలో చోటుచేసుకుంది. హీనా కౌసర్(27) అనే మహిళకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. అయితే దంపతుల మధ్య తరుచూ గొడవలు జరగడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో హీనా పిల్లలతో కలిసి మైసూరు జిల్లాలోని ఉదయగిరి పట్టణం గౌసియా నగరలో నివాసముంటోంది.

Also Read:

అయితే ఒంటరితనం భరించలేకపోయిన హీనా పెద్దల సలహాతో మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. రెండో భర్తతో కాపురం చేస్తున్నప్పటికీ మొదటి భర్త జ్ఞాపకాలను మాత్రం మరిచిపోలేకపోయింది. రోజులు గడిచేకొద్దీ మొదటి భర్తతో విడిపోయి తప్పు చేశానేమోనన్న ఆందోళన మొదలైంది. దీంతో రెండో భర్తతో సరిగ్గా కాపురం కూడా చేయలేకపోతోంది. రోజూ మొదటి భర్తనే గుర్తుచేసుకుంటూ తీవ్ర మానసిక క్షోభకు గురైంది. దీంతో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here