‘మహా’ రాజకీయాల్లో మలుపు.. వీడిన ఉత్కంఠ, ఉద్ధవ్ సీఎం పీఠం పదిలం

తీ వ్ర ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. తన పీఠాన్ని కాపాడుకునే దిశగా ముఖ్యమంత్రి కీలక అడుగువెశారు. మహారాష్ట్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ సోమవారం (మే 11) నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు పోటీగా ఎవరూ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దీంతో శివసేన శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. కాంగ్రెస్‌, ఎన్సీపీ పార్టీలు ఉద్ధవ్‌కు మద్దతు ప్రకటించడంతో ఆయన ఎన్నికల ఏకగ్రీవం కానుంది.

మహారాష్ట్రలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కీలక మలుపుల అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీ అండతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ఆయన ఏ సభకూ పోటీ చేయకుండానే ఈ బాధ్యతలు స్వీకరించారు.

ఈ నేపథ్యంలో మే 27 లోగా ఉద్ధవ్ ఠాక్రే.. మండలికి ఎన్నిక కాకపోతే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా మండలి ఎన్నికలు వాయిదా పడటంతో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నిర్వహణ అంశాన్ని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ పెండింగ్‌లో పెట్టడంతో ఈ ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరింది.

Must Read:

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే కేంద్ర ప్రభుత్వ సాయాన్ని అర్థించారు. మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో ఎన్నికల నిర్వహణకు గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఉద్ధవ్‌ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇక ఠాక్రేపై ఎవరూ పోటీ చేయకుండా మహా వికాస్‌ ఆఘాడీ నేతలు సంప్రదింపులు జరిపి సఫలీకృతులయ్యారు.

ఉద్ధవ్ పోటీ చేసే స్థానానికి ఆయన ఒక్కరు మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి రశ్మీ ఠాక్రే, కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. మే 21న దీంతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండలి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here