మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 1233 కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఉగ్రరూపం దాల్చింది. బుధవారం (మే 6) ఒక్క రోజే 1,233 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క రోజులో నమోదైన అత్యధికం కేసులు ఇవే. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,758కి ఎగబాకింది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కరోనాతో 34 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 651కు చేరుకుంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నగరంలో కేసుల సంఖ్య 10 వేల మార్క్ దాటింది. బుధవారం ఒక్క రోజే ముంబైలో కొత్తగా 769 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 10,527కి చేరింది. గత 24 గంటల్లో ముంబైలో కరోనాతో 25 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 412కి చేరింది.

Also Read:

ఆసియాలోనే అతిపెద్ద మురికవాడ ధారవిలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. అక్కడ కొత్తగా 68 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారవిలో మొత్తం కేసుల సంఖ్య 733కి చేరింది. బుధవారం కరోనాతో మరో వ్యక్తి మరణించడంతో అక్కడ మృతుల సంఖ్య 21కి పెరిగింది.

నవీ ముంబైలో అప్పుడే పుట్టిన చిన్నారికి కరోనా సోకడం ఆందోళన కలిగించే అంశం. కరోనా వైరస్ బారినపడి కొవిడ్‌-19 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణి బుధవారం ఓ పాపకు జన్మనిచ్చింది. చిన్నారికి పరీక్షలు నిర్వహించగా పాపకు కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

ముంబైలో గత ఆరు రోజుల్లో 6 వేలకు పైగా కరోనా కేసులు నమోదవడం అక్కడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నగరంలో మే 1 నుంచి మే 6 వరకు నమోదైన కేసులు ఇలా ఉన్నాయి..

మే 1 – 1008

మే 2 – 790

మే 3 – 678

మే 4 – 1567

మే 5 – 984

మే 6 – 1233

గత వారం రోజుల్లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6260.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here