బట్టలు ఉతకలేదని ఘాతుకం.. నిండు గర్భిణిని కత్తితో పొడిచి చంపిన బావ

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. బట్టలు ఉతకలేదన్న కారణంగా నిండు గర్భిణీని ఆమె బావ కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన శిడ్లఘట్ట తాలూకాలోని దిబ్బూరుహళ్ళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఆనేమడుగు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నవీన్‌చంద్రకు కొంతకాలం నాగజ్యోతి అనే యువతితో వివాహమైంది. అన్న హరీశ్‌కుమార్ కుటుంబంతో కలిసి నవీన్ చంద్ర కూడా ఒకే ఇంట్లో ఉండేవాడు. ఈ క్రమంలోనే నాగజ్యోతి గర్భం దాల్చింది. ఆమెకు సీమంతం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. దీంతో భర్త బుధవారం నాగజ్యోతికి బట్టలు కొనేందుకు పట్టణానికి వెళ్లాడు.

Also Read:

బుధవారం మధ్యాహ్నం ఇంట్లో టీవీ చూస్తున్న నాగజ్యోతిని బట్టలు ఉతకాలని బావ హరీశ్‌కుమార్ కోరాడు. అయితే తనకు అలసగా ఉందని, ఉతకలేనని ఆమె చెప్పడంతో అతడు ఆగ్రహానికి గురయ్యాడు. కోపం పట్టలేక కత్తి తీసుకుని ఆమెను కిరాతకంగా పొడిచేశాడు. నాగజ్యోతి కేకలు విన్న కుటుంబసభ్యులు ఆమె సమీపంలోని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై సమాచారం అందుకున్న దిబ్బూరుహళ్ళి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here