ఫుడ్ డెలివరీ పేరిట గంజాయి సరఫరా… లాక్‌డౌన్‌లోనూ ఆగని అక్రమ దందా

లాక్‌డౌన్‌ కారణంగా ఓ వైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. అక్రమార్కులేమో తమ చీకటి వ్యాపారాలు యథేచ్ఛగా నిర్వహించుకుంటున్నారు. ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం ఫుడ్ డెలివరీకి అనుమతిస్తే ఓ యువకుడు దాన్ని సరఫరాకు అనుకూలంగా మార్చుకున్నాడు. చెన్నైకి చెందిన ఓ యువకుడు బీకామ్ చదివి కొన్నాళ్లు ఫుడ్ ఆన్‌లైన్ డెలివరీ సంస్థలో పనిచేసి మానేశాడు.

Also Read:

ఆ సంస్థ యూనిఫామ్ అతడి వద్దే ఉంది. లాక్‌డౌన్ కాలంలో అతడికి ఉపాధి లేకపోవడంతో గంజాయి సరఫరాకు తెరదీశాడు. ఫుడ్ డెలివరీ యూనిఫామ్ వేసుకుని గంజాయిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నాడు. కొద్దిరోజులుగా సాగుతున్న ఈ దందాపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పటిష్టం చేసి ఆ యువకుడిని పట్టుకున్నారు. అతడి వద్ద 20 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here