పారిశుధ్య కార్మికుడిపై గొడ్డలితో దాడి.. ముస్లింలను రెచ్చగొడుతూ రివర్స్ ప్రచారం

క్లెయిమ్:

బీజేపీ గూండాలు ముస్లిం యువకులను ఎలా కొడుతున్నారో చూడండి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో తీవ్ర కలకలం రేపింది. లాక్‌డౌన్‌ సమయంలో ఈ ఘటన జరిగిందంటూ వీడియోను పోస్టు చేశారు. 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఓ యువకుడిని కొంత మంది కర్రలతో విచక్షణా రహితకంగా కొడుతున్న దృశ్యాలు కలవరానికి గురిచేస్తున్నాయి. ఆ యువకుడు మంటలకు తాలలేక ఆర్తనాదాలు చేస్తున్నా.. ఆ గుంపు వినిపించుకోకుండా చితకబాదారు.

నదియా జిల్లా కాంగ్రెస్ పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ సఫీ మాలిక్ పేరుతో ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన సదరు వీడియో ఓ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంది. ‘లాక్‌డౌన్ పేరుతో మధ్యప్రదేశ్‌లో బీజేపీ గుండాలు ముస్లిం యువకుడిని ఎలా చిత్ర హింసలకు గురిచేస్తున్నారో చూడండి..’ ఆ వీడియో కింద కామెంట్ పెట్టారు.

వాస్తవం:

ముస్లిం యువకుడిపై బీజేపీకి చెందినవాళ్లు దాడి చేశారనేది పూర్తిగా అవాస్తవం. ఆ వీడియోలో కనిపిస్తున్న బాధితుడు ఓ పారిశుధ్య కార్మికుడు. మధ్యప్రదేశ్‌లో ఓ ప్రాంతంలో విధులు నిర్వహించడానికి వెళ్లిన పారిశుధ్య కార్మికులపై కొంత మంది ముస్లింలు దాడి చేసి విచక్షణారహితంగా చితకబాదిన దృశ్యాలకు సంబంధించిన వీడియో అది. దానికి పూర్తి విరుద్ధమైన అంశాన్ని జోడించి వైరల్ చేశారు.

Must Read:

వెరిఫికేషన్ పద్ధతి:

ఇన్‌విడ్ గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ సాయంతో వీడియోను చిన్న చిన్న ఫ్రేములుగా విడగొట్టి, రివర్స్ ఇమేజ్ విధానంలో పరిశీలించగా.. గూగుల్ సెర్స్ ఇంజన్‌లో అదే వీడియోకు సంబంధించిన ఓ వార్త కథనం లభ్యమైంది. ఏప్రిల్ 18న ఎన్‌డీటీవీ వెబ్‌సైట్‌లో ఈ కథనాన్ని ప్రచురించారు. ‘మధ్యప్రదేశ్‌లో పారిశుధ్య కార్మికుడి దుస్తులు చింపి, దాడి’ అనే హెడ్డింగ్‌తో ఈ వార్తా కథనాన్ని వేశారు.

మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో కొంత మంది పారిశుధ్య సిబ్బంది తమ పరిసర ప్రాంతంలో వీధులను శుభ్రం చేయడానికి వెళ్లగా.. ఓ స్థానికుడు కొంత మంది అనుచరులతో వారిపై విచక్షణారహితంగా దాడిచేశాడని, దాడిలో గొడ్డలి, కర్రలు ఉపయోగించారని వార్తా కథనంలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జత చేశారు.

ఈ దాడిలో దీపక్ అనే పారిశుధ్య కార్మికుడు, మరికొంత మంది సిబ్బంది తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు వెల్లడించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆదిల్ అనే వ్యక్తిని గుర్తించామని.. అతడితో పాటు మరి కొంత మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి సజ్జన్ సింగ్ తెలిపినట్లు వార్తా కథనంలో వివరించారు. గొడ్డలితో దాడి చేయడంతో ఓ కార్మికుడి చేతికి తీవ్ర గాయమైందని.. అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు.

తీర్పు:

ఆదిల్, అతడి అనుచరులు కలిసి పారిశుధ్య కార్మికుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన దృశ్యాలకు సంబంధించిన వీడియోకు అవాస్తవాన్ని జోడించి.. లాక్‌డౌన్‌లో ముస్లిం యువకులపై బీజేపీ గూండాలు దాడి చేస్తున్నాయంటూ అసత్య ప్రచారం చేశారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here