నా భార్య, పిల్లలను కలపండి ప్లీజ్.. రూ.10 లక్షలిస్తా, దుబాయ్ నుంచి ఓ తండ్రి ఆవేదన

క రోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో అందరూ ఇంట్లోనే ఉంటూ కుటుంబాలతో సమయం గడుపుతున్నారు. ఇదే సమయంలో కొంత మంది తాము పనిచేస్తున్న చోట చిక్కుకొని, సొంత వాళ్లకు దూరమై మనోవేదన చెందుతున్నారు. కేరళకు చెందిన ఓ కుటుంబానిది మరింత విషాద గాథ. కుటుంబంలోని వ్యక్తులందరూ చెల్లాచెదురుగా ఒక్కో చోట ఉన్నారు. అందరూ కలుసుకోవడానికి రెండు నెలలుగా తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ, వారి ఆశలన్నీ నీరు గారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ పెద్ద కీలక ప్రకటన చేశారు. తన భార్య, పిల్లలను ఒక్క చోటకు చేర్చడానికి సహకరించిన వారికి అందిస్తానని వెల్లడించారు. ఇది చర్చనీయాంశంగా మారింది.

కేర‌ళ‌లోని అలప్పూజ జిల్లాకు చెందిన కేఆర్ శ్రీకుమార్ బతుకుదెరువు వెతుక్కుంటూ గల్ఫ్ వెళ్లారు. దుబాయ్‌లో ఎంటర్‌ప్రెన్యూయర్‌గా స్థిరపడ్డారు. ఆయన భార్య, పిల్లలు మాత్రం కేరళలోని సొంతింట్లో ఉంటున్నారు. అయితే.. లాక్‌డౌన్‌కు కొద్ది రోజుల ముందు వీరి పెద్ద కుమారుడు తమిళనాడులోని తిరుచిరాపల్లికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి అక్కడే చిక్కుకుపోయాడు. ఇదే సమయంలో చిన్న కుమారుడితో కలిసి కర్ణాటకలోని మంగళూరు వెళ్లిన శ్రీకుమార్ సతీమణి అక్కడే చిక్కుకుపోయారు.

లాక్‌డౌన్‌తో ఊహించనివిధంగా వీరంతా వేర్వేరు ప్రదేశాల్లో చిక్కుకున్నారు. ఎప్పుడెప్పుడు ఒక చోట కలుస్తామా అని ఎదురుచూస్తుండగా.. రెండుసార్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. సొంత ఖర్చులతో తాను దుబాయ్ నుంచి రావడానికి ప్రయత్నించి విఫలమైన శ్రీకుమార్.. కనీసం తన కుటుంబసభ్యులనైనా ఒక‌ చోటకి చేర్చుదామని కలలు కంటున్నారు. అందుకోసం ఎన్నో ప్రయ‌త్నాలు చేశారు.

Also Read:

తిరుచిరాపల్లిలో చిక్కుకున్న శ్రీకుమార్ పెద్ద కుమారుడు, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కోజికోడ్‌లోని సొంతింటికి వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ, కేరళ సరిహద్దులో పోలీసులు వారిని అడ్డుకొని తిరిగి వెనక్కి పంపించారు. ఆ తర్వాత శ్రీకుమార్.. రూ.15 వేలకు ఓ క్యాబ్‌ను మాట్లాడారు. తన కుమారుడిని స్వస్థలానికి చేరుస్తామని హామీ ఇచ్చిన ఆ క్యాబ్ నిర్వాహకులు.. కనీసం వాహనాన్ని కూడా పంపించకుండానే చేతులెత్తేశారు. దీంతో శ్రీకుమార్ ఈసారి మరో అడుగు ముందుకేశారు.

పెద్ద కుమారుడిని ఇంటికి చేర్చడానికి సొంతంగా ఓ హెలికాప్టర్‌ను మాట్లాడుకున్నారు. కానీ, అది ఎగ‌ర‌డానికి అధికారులు అనుమ‌తించ‌లేదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వం హెలికాప్టర్ ఎగరడానికి అనుమతి ఇస్తోందని అధికారులు చెప్పారు. పలువురు ఉన్నతాధికారులతోనూ మాట్లాడారు. కానీ, ఏ ఒక్కరి నుంచి సానుకూల స్పందన రాలేదు.

Must Read:

ఇటు మంగళూరులో చిక్కుకున్న శ్రీకుమార్ భార్య, చిన్న కుమారుడిని స్వస్థలానికి చేర్చడానికి కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ ద్వారా ఇ-పాస్ కోసం ఆయన దరఖాస్తు చేశారు. మే 6న ఇ-పాస్ మంజూరైంది. అయితే.. ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. మే 3న వెళ్లడానికి అనుమతిస్తూ అధికారులు అనుమతి ఇచ్చారు. ఆ గడువు ముగిసిన మూడు రోజుల తర్వాత ఇ-పాస్ చేతికొచ్చింది.

తన ప్రయత్నాలన్నీ విఫలమైన వేళ శ్రీకుమార్ కీలక ప్రకటన చేశారు. తన కుటుంబ సభ్యులను ఇంటికి సుర‌క్షితంగా చేర్చిన‌వారికి రూ.10 ల‌క్షల న‌జ‌రానా ఇస్తానని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. సోష‌ల్ మీడియా ద్వారా అయినా ఏదైనా సాయం అందుతుందేమో అని చూస్తున్నారు. అయితే.. మంగళవారం (మే 12) వరకు డెడ్‌లైన్ విధించారు. ఆ లోగా తన కుటుంబ సభ్యులను ఇంటికి చేర్చిన వారికి క‌ళ్లు చెదిరే పారితోషాకాన్ని అందిస్తానని ఆశజూపారు. మరి దీనికి ఎంత మంది స్పందిస్తారో? ఎవ‌రి ప్రయత్నాలు ఫ‌లిస్తాయో వేచి చూడాల్సిందే.. అయితే, ఈలోగా శ్రీకుమార్ ఫేస్‌బుక్ పోస్టు మాత్రం వైరలైంది.

Don’t Miss:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here