దేశంలో 28వేలకు చేరువలో కరోనా కేసులు.. గడచిన 24 గంటల్లోనే అత్యధికం

దేశంలో మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోంది. కొత్త కేసుల సంఖ్య అంత కంతకూ పెరుగుతుండగా గడచిన గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 2వేల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దేశంలో వైరస్ మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు, మరణాలు ఆ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 8వేలు దాటేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 27,890 మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో 881 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ 6,523 మంది కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.

ఢిల్లీలోని బాబూ జగ్జీవన్‌రామ్‌ హాస్పిటల్‌లో 19 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ ఆసుపత్రిలో మొత్తం 65 మందికి కరోనా సోకినట్లయింది. చత్తీస్‌గఢ్‌లో 15 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరంతా ఇటీవల యూపీలోని ఆగ్రాలోలాక్‌డౌన్ విధులను నిర్వర్తించారు. ఈ సమయంలో వీరు క్యాంప్‌లో వంట మనిషికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వీరిని క్యారంటైన్‌కు తరలించారు.

మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 22 మంది చనిపోయారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాలు 342కి చేరాయి. ఒడిశాలో ఆదివారం 9 మందికి కరోనా సోకడంతో మరిన్ని ప్రాంతాలను కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కువ కేసులున్న భద్రక్, బాలాసోర్, జైపూర్ జిల్లాల్లోని ప్రాంతాలను పూర్తిగా దిగ్బంధం చేశారు. మూడు జిల్లాల్లో విధించిన 60 గంటల సంపూర్ణ లాక్‌డౌన్‌ ఆదివారం నాటితో ముగిసింది.

కరోనా మరణాల్లో రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌‌లో ఆదివారం మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మొత్తం కరోనా మరణాలు 151కి చేరాయి. మధ్యప్రదేశ్‌లో కరోనా మరణాలు 10దాటాయి. గుజరాత్‌లో మొత్తం కేసులు 3,301కి చేరగా.. ఢిల్లీలో 29,18గా నమోదయ్యాయి. రాజస్థాన్ 2,185, మధ్యప్రదేశ్ 2,090, తమిళనాడు 1,885, ఉత్తరప్రదేవ్ 1,873, ఆంధ్రప్రదేశ్ 1,097, తెలంగాణ 1,000గా నమోదయ్యాయి.

హరియాణాలో ఒక మహిళా ఎస్సై సహా 9 మంది కరోనా బారినపడ్డారు. కేరళలో కొత్తగా ఒక మహిళా డాక్టర్, ముగ్గురు ఆరోగ్య సిబ్బంది సహా 11 మందికి కరోనా సోకింది. ఆ రాష్ట్రంలో హాట్‌స్పాట్లు 87కి పెరిగాయి. వేర్వేరు దేశాల్లో చిక్కుకుపోయిన కేరళవాసులు సొంత రాష్ట్రానికి వచ్చేందుకు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకునే సదుపాయాన్ని ‘ప్రవాస కేరళవాసుల వ్యవహారాల విభాగం’ అందుబాటులోకి తెచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండగా.. తెలంగాణలో గత నాలుగు రోజుల నుంచి తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా శ్రీకాకుళం జిల్లాకు వైరస్ విస్తరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీలో 31 మంది, తెలంగాణలో 25 మంది ఇప్పటి వరకూ కరోనాతో చనిపోయారు. మహారాష్ట్రలోని ముంబయి నగరంలోన 5,407 మంది వైరస్ బారినపడ్డారు. అలాగే ఆసియాలో అతిపెద్ద మురికివాడ ధారవీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 250కి చేరింది. పుణేలోనూ 1,052 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here