కేం ద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను మరో రెండు వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 17 వరకు లాక్డౌన్ కొనసాగనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని మినహాంపులు ఇస్తూ రెడ్ జోన్లలో ఆంక్షలు కొనసాగించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ శుక్రవారం (మే 1)న ఉత్తర్వులు జారీ చేసింది. మే 4 నుంచి 17 వరకు లాక్డౌన్ కొనసాగనుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సమీక్షా సమావేశం అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు.
అంశంపై ప్రధాని మోదీ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు ఆయన మీడియా ద్వారా వివరాలు వెల్లడించనున్నారు. కరోనా కట్టడి చర్యల కొనసాగింపుపై కీలక చర్యలు ప్రకటించే అవకాశం ఉంది. ఎలాంటి అంశాలకు మినహాయింపులు ఇస్తారు? మినహాయింపులు ఇచ్చిన చోట్ల కార్యకలాపాలు ఎలా సాగించాలి తదితర అంశాలపై మోదీ వివరించే అవకాశం ఉంది.
Also Read: