తల్లి డబ్బులివ్వలేదని మనస్తాపం.. మంటల్లో దూకి యువకుడి ఆత్మహత్య

తల్లి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై మంటల్లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జిల్లాలో జరిగింది. ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాజేష్‌(22) ఐటీఐ పూర్తి చేశాడు. ఇటీవల అతడి తల్లి కళావతి, అన్న మహేష్‌ రూ.4లక్షలు అప్పు చేసి భూమి కొన్నారు. అయితే తాను వనపర్తిలో వ్యాపారం చేసుకునేందుకు డబ్బులు ఇవ్వాలంటూ రాజేశ్ తల్లిని ఒత్తిడి చేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి వ్యాపారాలు చేయడం కుదరడం లేదని, కొద్దిరోజులు ఆగాలని తల్లి, అన్న అతడికి నచ్చజెప్పారు.

Also Read:

వారి మాటలు పట్టించుకోని రాజేశ్ డబ్బులు కావాలంటూ రోజూ గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన రాజేష్‌ సోమవారం పొలం దగ్గరకు వెళ్లి కొత్తకుంట చెరువు ప్రాంతంలో ఎండిపోయిన పొదలకు నిప్పు పెట్టి అందులో దూకేశాడు. మంటలను గమనించిన స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఫైరింజన్లు వచ్చేసరికే రాజేశ్ పూర్తిగా కాలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో సంఘటనా స్థలం దగ్గరే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here