జూన్ 30 వ‌ర‌కు వాటిపై నిషేధం: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌

క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ పాటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. మ‌రోవైపు లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కీల‌క నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర‌వ్యాప్తంగా జూన్ 30 వ‌ర‌కు సామాజిక సమావేశాల‌ను నిషేధిస్తున్న‌ట్లు రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ తెలిపారు. మ‌రోవైపు ఇటీవలే ఇత‌ర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని త‌మ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు యోగి ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.

Must Read:

మ‌రోవైపు పవిత్ర‌మైన రంజాన్ మాసం ప్రారంభ‌మైన రాష్ట్ర‌ప్ర‌భుత్వం కొన్ని సూచ‌న‌లు చేసింది. ముస్లింలంతా ఇళ్ల‌ల్లోనే న‌మాజు చేసుకోవాల‌ని సూచించింది. అలాగే మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించుకోకూడ‌ద‌ని పేర్కొంది. మ‌రోవైపు రాష్ట్ర‌వ్యాప్తంగా న‌మోదవుతున్న పాజిటివ్ కేసుల్లో త‌బ్లిగీ జ‌మాత్‌కు సంబంధ‌మున్న‌వారేన‌ని తెలిపింది.

Must Read:

ఉత్త‌రప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు విస్త‌ర‌ణ వేగంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 1600కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే 25 మంది ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా మృత్యువాత‌ప‌డ్డారు. క‌రోనాను అడ్డుకట్ట వేసేందుకు గ‌త‌నెల 25 నుంచి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ పాటిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చేనెల 3 వ‌ర‌కు ఈ లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here