గుడ్‌న్యూస్.. రైళ్లు తిరిగేందుకు డేట్ ఫిక్స్, కానీ..

లాక్ డౌన్ కారణంగా గత నెలన్నర రోజులకు పైగా ఆగిపోయి ఉన్న రైళ్లను మళ్లీ పట్టాలెక్కించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. మే 12 నుంచి మెల్లగా రైళ్ల కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్నారు. తొలుత 15 రైళ్లను ప్రారంభించే పనిలో ఉన్నారు. అంటే రానుపోనూ సర్వీసులతో కలిపి మొత్తం 30 రైళ్లను నడుపుతారు. ఢిల్లీ నుంచి డిబ్రుగఢ్, అగర్తలా, హౌరా, పట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భుబనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై తిరువనంతపురం, మెడగావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తావి తదితర ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నారు. వీటిని ప్రత్యేక రైళ్లుగా పిలవనున్నారు.

శనివారం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక, కేబినెట్ సెక్రటరీ వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులతో శనివారం జరిపిన వీసీలోనూ ఆయా రాష్ట్రాలు ఈ నిర్ణయానికి మద్దతు పలికినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

బుకింగ్‌లకూ అనుమతి..

పాసింజర్‌ రైళ్లలో రిజర్వేషన్లు మే 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మొదలు కానున్నట్లు ఓ జాతీయ వార్తా సంస్త వెల్లడించింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్లు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లను మూసే ఉంచుతారు. కన్ఫార్మ్‌ అయిన టికెట్లు కలిగిన ప్రయాణికులకు మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి అనుమతి ఉంటుంది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌, ధరించి, స్కీనింగ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రయాణానికి అనుమతి ఇస్తారు.

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మూడో విడత లాక్ డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇది మే 17తో ముగియనుంది. అంతేకాక, ప్రధాని మోదీ సోమవారం ముఖ్యమంత్రులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి లాక్ డౌన్ పొడిగింపు లేదా సడలింపులపై ఈ సమావేశం ద్వారా ఓ నిర్ణయానికొచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Must Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here